ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ (CID) మాజీ డైరెక్టర్ జనరల్ (డీజీ) పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ను మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం, ఆయన సస్పెన్షన్ 2025 ఆగస్ట్ 28 వరకు కొనసాగనుంది.

ఈ నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వ రివ్యూ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా తీసుకున్నది. పీవీ సునీల్ కుమార్పై జరిగిన విచారణలో ఆయనపై చేసిన ఆరోపణలు తీవ్రతరంగా నమోదయ్యాయి. ముఖ్యంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన తరచుగా విదేశీ పర్యటనలు చేసినట్టు ఆధారాలు లభించాయి.
అనుమతుల్లేని విదేశీ పర్యటనలు:
సునీల్ కుమార్కు ప్రభుత్వ నుంచి కొన్ని సందర్భాల్లో పరిమిత అనుమతులు ఇచ్చినా, వాటిని అతిక్రమించి ఇతర దేశాలకు వెళ్లిన ఘటనలు నమోదయ్యాయి. ఉదాహరణకు జార్జియాకు వెళ్తున్నానని అనుమతి తీసుకున్న తర్వాత నేరుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అమెరికాకు వెళ్తున్నానని తెలియజేసి, చివరకు యునైటెడ్ కింగ్డమ్ (UK) పర్యటనకు వెళ్లినట్టు గుర్తించారు. ఈ తరహా అనుమతుల్ని మించిపోయే చర్యలు సునీల్ కుమార్ ఎటు తిప్పారో సూచిస్తున్నాయి. దాదాపు ఆరు సార్లు ఆయన అనుమతులు లేకుండానే విదేశాలకు వెళ్లినట్టు విచారణ నివేదికలు వెల్లడించాయి. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండానే ఆయన తరచుగా విదేశాల్లో పర్యటించారు. ఈ విచారణల తర్వాత, అప్పటి చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆధ్వర్యంలో పీవీ సునీల్ కుమార్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు, తాజా పరిణామాల ప్రకారం, విచారణ ఇంకా కొనసాగుతోందని, తదుపరి చర్యల వరకు ఆయన సస్పెన్షన్ కొనసాగాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read also: Suicide: చిన్నారి మృతి మిస్టరీ వీడక ముందే అమ్మ అమ్మమ్మ ఆత్మహత్య