Sujana Chowdary: సుజనా చౌదరికి విజయవంతంగా సర్జరీ పూర్తి

Sujana Chowdary: సుజనా చౌదరికి విజయవంతంగా సర్జరీ పూర్తి

ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటీషియన్, విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు.ఆయన లండన్‌ పర్యటనలో ప్రమాదవశాత్తు జారిపడటంతో కుడిచేయికి తీవ్రగాయమైంది.అయితే ఆయన చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు గుర్తించారు. వెంటనే ఆయన్ను లండన్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.బేగంపేటలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు,అక్కడ ఆ ఆసుపత్రి ఎండీ, చీఫ్‌ రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్ ఏవీ గురవారెడ్డి నేతృత్వంలో నలుగురు డాక్టర్లు నాలుగు గంటల పాటు సుజనా చౌదరికి సర్జరీ చేశారు.లండన్‌ పర్యటనలో సుజనా చౌదరి జారి కింద పడిపోవడంతో ఆయన షోల్డర్‌ హ్యుమరస్‌లో ఫ్రాక్చర్‌ (ఐదారు ముక్కలు) అయిందని డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. సుజనా చౌదరికి విరిగిన ఎముకను యథాస్థానానికి చేర్చి ప్లేట్లు అమర్చి సర్జరీ విజయవంతంగా నిర్వహించామని గురవారెడ్డి చెప్పారు. నెల నుంచి రెండు నెలల పాటు ఆయనకు ఫిజియోథెరపీ అవసరం అవుతుందన్నారు.ఆయన త్వరగా కోలుకుంటారన్నారు,ఆ తర్వాత ఆయన ఆ చేతితో అన్ని పనులూ యథావిధిగా చేసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు డాక్టర్ గురవారెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు.హెల్త్ అప్డేట్ ఏంటో చెప్పారు,సుజనా చౌదరి లండన్ పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడ జారిపడినట్లు తెలుస్తోంది,చేయికి తీవ్ర గాయం కావడంతో వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.

Advertisements
 Sujana Chowdary: కోలుకుంటున్న సుజనా చౌదరి

ఆరోగ్యం

వాస్తవానికి సుజనా చౌదరి ఈ నెల 2న కూడా విజయవాడలో ఉన్నారు ఆ రోజు అమరావతికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. అయితే ఆ తర్వాత ఆయన లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది,అక్కడ ఆయన గాయపడ్డారు. సుజనా చౌదరి ఆరోగ్యంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరా తీశారు,సర్జరీ విజయవంతం కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. సుజనా చౌదరి టీడీపీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా పదవి దక్కింది,2014లో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీజేపీలో చేరారు,2024 ఎన్నికల్లో సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి 47,032 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.

Read Also : Andhra Pradesh: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే ఎక్కడంటే?

Related Posts
ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు
ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు

భారతదేశంలో వందేభారత్ రైలు ఓ చరిత్ర. పలు సౌకర్యాలతో పాటు నిర్ణిత సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇందులో భాగంగా త్వరలో ప్రముఖ పుణ్యక్షేత్ర వారణాసికి ఏపీ నుంచి Read more

AP;telangana;అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.
అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

తెలంగాణ రాష్ట్రం దేశంలో మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది రోజుకు లక్షలాది లీటర్ల మద్యం విక్రయాలు జరుగుతుండగా దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో Read more

Andhra Pradesh: పదో తరగతి ఫలితాల్లో నేహాంజని అనే బాలికకు 600/600 మార్కులు
Andhra Pradesh: పదో తరగతి ఫలితాల్లో నేహాంజని అనే బాలికకు 600/600 మార్కులు

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో నేహాంజని అరుదైన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు వెలువడగా, ఓ విద్యార్థిని చరిత్ర సృష్టించింది. కాకినాడకు చెందిన నేహాంజని Read more

ఏపీలో నేడే మద్యం షాపుల కోసం లాటరీ
Liquor shops lottery today in AP

అమరావతి: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×