Street dogs: వీధి కుక్కలకు బలైన నాలుగేళ్ళ బాలుడు

Street dogs: వీధి కుక్కలకు బలైన నాలుగేళ్ళ బాలుడు

గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక పట్టణాల్లో వీధికుక్కల దాడుల ఘటనలు నిరంతరం నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల చిన్నారులు తీవ్రంగా గాయపడగా, మరికొన్ని ప్రాంతాల్లో బాలికలపై దాడులు చోటు చేసుకున్నాయి. కానీ, ఈ దాడులపై శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలన్న పట్టుదల ప్రభుత్వాల్లో కనిపించడం లేదు. తాజాగా నంద్యాల జిల్లాలో స్వైర విహారం చేశాయి. నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టి కరిచి పీక్కుతిన్నాయి. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ దారుణ ఘటన బేతంచెర్ల హనుమాన్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది.

Advertisements

బేతంచెర్ల ఘటన

నంద్యాల జిల్లా బేతంచెర్ల హనుమాన్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ తాజా ఘటన ప్రజలలో తీవ్ర ఆవేదన రేపింది. నాలుగేళ్ల మోహిద్దీన్ ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగానే, వీధికుక్కలు అతనిపై దాడి చేయడం, ప్రాణాల్ని తీసుకోవడం అత్యంత హృదయ విదారకం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. హనుమాన్‌నగర్‌ కాలనీలో హుస్సేన్‌ బాషా, ఆశ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అయితే చిన్న కుమారుడు నాలుగేళ్ల మొహిద్దీన్‌ శుక్రవారం సాయంత్రం మరో బాలుడితో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంటి సమీపంలోనే వారిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో వీధి కుక్కల గుంపు వారిపై దాడికి యత్నించింది. దీంతో వారిద్దరూ పరుగెత్తారు. అయినప్పటికీ నాలుగు సంవత్సరాల మొహిద్దిన్.. శునకాల దాడికి గురయ్యాడు. శునకాలు ఒకేసారి దాడి చేసి తీవ్రంగా రక్కేశాయి. దీంతో తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. అయితే చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read also: Accident: తమ చిన్నారులు టెన్త్ పాస్ అయ్యారని దైవ దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఘోర ప్రమాదం

Related Posts
వెంకీమామ ఏంటి ఈ రికార్డ్స్ …సంక్రాంతి మొత్తం నీదే..!
SKV firstweek

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫామిలీ & యాక్షన్ డ్రామాగా Read more

షర్మిలపై జగన్ కీలక వ్యాఖ్యలు
షర్మిలతో విభేదాలు తీవ్రతరం – జగన్ కీలక ఆరోపణలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా Read more

Jagan : అంజలి కుటుంబ సభ్యులకు జగన్ భరోసా
jagan anjali

రాజమండ్రిలో AGM వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని అంజలి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇవాళ తనను కలిసిన ఆమె కుటుంబ Read more

నంద్యాల: ఆర్టీసీ బస్సు బోల్తా..20 మందికి గాయాలు
నంద్యాల: ఆర్టీసీ బస్సు బోల్తా..20 మందికి గాయాలు

నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కడప Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×