సోషల్ మీడియా

Viral to Vanished: సోషల్ మీడియా మాయలో జీవన కథలు

మాయాలోకం అయిన సోషల్ మీడియా

Facebook, YouTube, Instagram — ఇవి మానవ జీవితాలను మలుపుతిప్పే వేదికలుగా మారిపోయాయి. ఒక్క వీడియో, ఒక్క మాట… జీవితాన్ని ఆకాశానికీ తీసుకెళ్లగలదు. అదే విధంగా నేలకూ పడేస్తుంది. “కోతి కొబ్బరికాయ” పట్టుకున్నట్టు ఎప్పుడెప్పుడు మాయమవుతామో తెలియదు.

బర్రెలక్క కథ: వైరల్ నుండి ఎన్నికల వరకు

మహబూబ్ నగర్ జిల్లాలోని శిరీష పేరు బర్రెలక్కగా మారింది. చదువుకున్నా ఉద్యోగం రాలేదని, బర్రెలు మేపుతున్నానని చెప్పిన ఆమె వీడియో వైరల్ అయింది. ఆమె ఎన్నికల్లో పోటీ చేసి జాతీయ గుర్తింపు పొందింది. కానీ ఆశించిన ఫలితం రాలేదు. సోషల్ మీడియాలో వచ్చిన మద్దతు, రియాలిటీలో ఓట్లుగా మారలేదు.

కుమారి ఆంటీ హోటల్: హల్చల్ నుండి హాస్యంలోకి

హైటెక్ సిటీలో చిన్న హోటల్ నడిపిన కుమారి ఆంటీ, “లివర్ 1000 రూపాయలు” అన్న మాటతో ట్రెండ్ అయింది. ఆ తర్వాత ట్రాఫిక్ సమస్యలు, పోలీసుల హెచ్చరికలు, మద్దతు – అన్నీ ఒకేసారి వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కానీ చివరికి ట్రోలింగ్, ఫుడ్ మీద విమర్శలు వచ్చి హోటల్ మూత పడే స్థితికి చేరింది.

అలేఖ్య చిట్టి పికల్స్:

ట్రోలింగ్ తో వ్యాపారం డౌన్
రాజమండ్రిలో ప్రారంభించిన పికల్స్ బ్రాండ్, కొద్ది రోజుల్లోనే పాపులర్ అయింది. కానీ ఖరీదు ఎక్కువ అన్న వినియోగదారులపై ఇచ్చిన తిట్లే వారి వ్యాపారాన్ని నాశనం చేశాయి. ఫోన్ కాల్స్, వాడిన భాష సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి బ్రాండ్ డిజాస్టర్ అయింది.

సామాజిక ప్రభావం: వైరల్ తర్వాత వ్యధలు

సోషల్ మీడియాలో వచ్చిన ఒక్క చాన్స్ జీవితాన్ని మార్చే అవకాశం ఇచ్చినా, అదే వేదిక దారుణమైన ట్రోలింగ్, పర్సనల్ లైఫ్ లీక్, మానసిక ఒత్తిడి తెచ్చిపెడుతోంది. కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు, మరికొంతమంది బతుకు రోడ్డుమీదకు వచ్చారు.

ముగింపు:

సోషల్ మీడియా ఓ శక్తివంతమైన హస్తం. అది మంచి చేస్తే ఆకాశమంత ఉన్నతికి తీసుకెళ్తుంది. అదే చేతికి దెబ్బ తగిలితే బతుకు బండిని తిప్పేస్తుంది. అందుకే ఈ మాయాలోకం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వైరల్ కంటే విలువైనది మన నిజమైన జీవితం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×