నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
Stock markets

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. మంగళవారం సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లగా.. బుధవారం మాత్రం కొనుగోళ్లు ఆవిరైపోయాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు..ముగింపు వరకు అదే ఒరవడి కొనసాగింది. సెన్సెక్స్ 426 పాయింట్లు నష్టపోయి 79, 924 దగ్గర ముగియగా.. నిఫ్టీ 108 పాయింట్లు నష్టపోయి 24, 324 దగ్గర ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.83.53 వద్ద కొనసాగుతుంది.