The details of the deceased

తిరుపతిలో తొక్కిసలాట.. మృతుల వివరాలు

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధువారం జరిగిన తొక్కిసలాట ఘటనా అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చిన కారణంగా గందరగోళం చోటుచేసుకొని తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

ఈ దుర్ఘటనలో నర్సీపట్నానికి చెందిన నాయుడుబాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) మృతి చెందారు. ఈ మృతుల కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. ఈ తొక్కిసలాటలో మరో 40 మంది భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే తిరుపతి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని పర్యవేక్షించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. భక్తుల అధిక సంఖ్య, నిర్వాహకుల వైఫల్యం, సరైన భద్రతా చర్యల లేకపోవడం వంటి అంశాలు ప్రాథమికంగా వెల్లడయ్యాయి.

Related Posts
ఒక్క‌టిగా ఎదుగుదాం.. ప్ర‌చారాన్నిరాహుల్ ద్ర‌విడ్‌తో ప్రారంభించిన శ్రీ‌రామ్ ఫైనాన్స్
Let's grow as one.. Shriram Finance launched the campaign with Rahul Dravid

హైదరాబాద్‌: శ్రీ‌రామ్ గ్రూప్ వారి ప్ర‌ధాన కంపెనీ అయిన శ్రీ‌రామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌.. భార‌త‌దేశంలో ప్ర‌ధాన ఆర్థిక సేవ‌ల ప్రొవైడ‌ర్ల‌లో ఒక‌టి. ఇది తాజాగా “మ‌న‌మంతా క‌లిసి Read more

సీడబ్ల్యూసీ చైర్మన్‌ గా ముకేశ్‌ కుమార్‌ సిన్హా
Mukesh Kumar Sinha as the Chairman of CWC

న్యూఢిల్లీ: సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ చైర్మన్‌గా ముకేశ్‌ కుమార్‌ సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించిది. ఈ మేరకు డీవోపీటీ అండర్‌ సెక్రటరీ కుందన్‌ నాథ్‌ ఉత్తర్వులు జారీ Read more

అన్నింటికంటే పోలీసు శాఖ అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు
CM Chandrababu Speech in Police Commemorative Day

విజయవాడ: నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విధి నిర్వహణలో చాలా మంది Read more

దావోస్‌లో చంద్రబాబు డ్రీమ్
దావోస్‌లో చంద్రబాబు డ్రీమ్

30 సంవత్సరాల క్రితం ఓ సమయం గుర్తు చేసుకోండి. ఓ యువ, మహత్వాకాంక్షి నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు, తన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద కలలు కంటున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *