తమిళనాడుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, కేంద్రంపై గట్టిగా మండిపడ్డారు. కేంద్ర నిధుల కోసం మన ప్రభుత్వం ఏడుస్తోందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు అశోభనీయమని, అవి బాధించేవిగా ఉన్నాయని చెప్పారు. గుజరాత్ సీఎం పదవిలో ఉన్నప్పుడు మోదీ నిధుల కోసం ఎలా విజ్ఞప్తులు చేసారో దేశం మొత్తం చూసిందని గుర్తుచేశారు.”కేంద్రం ఎంత ఇచ్చినా తమిళనాడు ఏడుస్తోందంటూ మోదీ అన్నట్టు వినిపిస్తోంది.అసలు ఇది ఎలా సమంజసం? మనం కేంద్ర నిధులు అడగడంలో తప్పేమీ లేదు.ఇది ప్రజల హక్కు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందే. అందులో కించిత్తైన కోరిక పెట్టినా, విమర్శలు చేయడమా?” అంటూ స్టాలిన్ ప్రశ్నించారు.మోదీ మాటలు ఆవేదన కలిగించేవిగా ఉన్నాయని ఆవేశంగా స్పందించారు.తమిళనాడు లోక్ సభ స్థానాల్లో తగ్గుదల ఉండదన్న స్పష్టత అవసరమంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి హామీ కోరారు.

డీలిమిటేషన్ వల్ల తమిళనాడు వినిపించకుండా పోతుందని భావిస్తున్నారని తెలిపారు.రాష్ట్రానికి న్యాయం కావాలన్నదే తమ ఆవశ్యకత అని స్టాలిన్ స్పష్టం చేశారు.నీట్ విషయంలో తమిళనాడు చాలా కాలంగా ప్రత్యేక వైఖరిని కొనసాగిస్తోంది. ఇప్పుడు కూడా అదే తీరు కొనసాగిస్తున్న స్టాలిన్.రాష్ట్రాన్ని ఈ జాతీయస్థాయి పరీక్ష నుంచి తప్పించాలని కేంద్రాన్ని కోరారు.
రాష్ట్ర విద్యారంగ స్వతంత్రతకు ఇది కీలకమని అభిప్రాయపడ్డారు.తమిళనాడు మీద హిందీ భాషను బలవంతంగా మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన స్టాలిన్, భాష విషయంలో గౌరవం తప్ప, బలవంతం పనికిరాదన్నారు.”భాష అనేది ఎప్పుడూ స్వేచ్ఛగా పెరగాలి. దానిని విధించడమంటే ప్రజల్ని నొక్కి వేయడమే” అని పేర్కొన్నారు.ఇటీవల రామేశ్వరంలో పర్యటించిన ప్రధాని మోదీ మాట్లాడుతూ… గత పది సంవత్సరాల్లో తమిళనాడుకు కేంద్రం మూడింతలుగా నిధులు కేటాయించిందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. రైల్వే బడ్జెట్లో తమిళనాడుకు ఏడురెట్లు పెంచామన్నారు. అయినా కొందరు కేంద్రం ఎంత ఇచ్చినా సరిపోవట్లేదని చెప్పడం సరికాదన్నారు.ప్రధాని వ్యాఖ్యలు తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని స్టాలిన్ విమర్శించారు. అభివృద్ధి కోసం నిధులు అడగడం దోషం కాదని, ప్రజల హక్కు కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
Read Also : ఎలాన్ మస్క్తో ప్రధాని మోడీ ఫోన్లో చర్చలు