Srivari's Kalyanaratham leaving for Prayagraj Kumbh Mela

కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం

తిరుమల: ప్రముఖ్య పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణరథం బయలుదేరింది. కల్యాణ రథంకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు , అదనపు ఈవో వెంకయ్య చౌదరి జెండా ఊపి ప్రయాగ్‌రాజ్‌కు కళ్యాణరథాన్ని పంపారు. ఈ సందర్బంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. మహా కుంభ మేళా నేపథ్యంలో యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో 2.5 ఎకరాల్లో శ్రీవారి నమూన ఆలయాన్ని ఏర్పాటు చేశామని, ఈ నెల 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు భక్తులకు స్వామి వారీ దర్శనం కల్పిస్తామని అన్నారు.

image
image

నమూనా ఆలయంలో స్వామి వారికీ నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని, జనవరి 18, 26, ఫిబ్రవరి 3,12వ తేదీల్లో శ్రీవారికీ ప్రత్యేక కళ్యాణోత్సవ సేవను నిర్వహిస్తామన్నారు. డిప్యుటేషన్‌పై 150 మంది సిబ్బందిని ప్రయాగ్‌లో నియమించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారి దర్శనం కల్పిస్తామని ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి 40 కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. యాత్రికులు, భక్తులను చేరవేసేందుకు రైల్వే శాఖ పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. 50 రోజులపాటు 13 వేల రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీటిలో పది వేలు రెగ్యులర్‌ సర్వీసులు కాగా.. మూడు వేలు ప్రత్యేక రైళ్లు. మేళా జరగడానికి 2-3 రోజుల ముందు.. ఆ తర్వాత 2-3 రోజుల వరకు రైళ్లు నడుస్తాయి. అలాగే పవిత్ర పుణ్యక్షేత్రాలను కలుపుతూ 560 రింగ్‌ రైళ్లు నడుపనుంది.

ప్రయాగరాజ్‌-అయోధ్య-వారాణసీ-ప్రయాగ్‌రాజ్‌, ప్రయాగరాజ్‌- సంగమ్‌ ప్రయాగ్‌- జాన్‌పూర్‌- ప్రయాగ్‌- ప్రయాగరాజ్‌, గోవింద్‌పురి-ప్రయాగరాజ్‌-చిత్రకూట్‌-గోవింద్‌పురి, ఝాన్సీ-గోవింద్‌పురి-ప్రయాగరాజ్‌-మాణిక్‌పూర్‌-చిత్రకూట్‌-ఝాన్సీ మార్గాల్లో వీటిని నడుపుతారు. ప్రయాగరాజ్‌ ప్రాంతంలోని మొత్తం 9 రైల్వే స్టేషన్లలో 560 టికెట్‌ కౌంటర్లను కూడా రైల్వే ఏర్పాటుచేస్తోంది. భక్తులు లక్షలాదిగా తరలిరానున్న నేపథ్యంలో రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌), రాష్ట్ర రైల్వే పోలీసుకు చెందిన 18 వేల మందికిపైగా సిబ్బందిని మోహరిస్తున్నట్లు ఉత్తర మధ్య రైల్వే జీఎం ఉపేంద్ర వెల్లడించారు. ప్రయాణికులకు వైద్య సేవలు అందించడానికి ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, ఈసీజీ యంత్రాలతో ప్రయాగరాజ్‌ జంక్షన్‌లో అబ్జర్వేషన్‌ రూంను ఏర్పాటు చేశామన్నారు.

Related Posts
ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా
ap mega dsc

ఏపీలో మెగా డీఎస్సీ 2024 వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. ఈ రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా Read more

ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావాలి – ప్రధాని మోదీ
modi france speech

మానవాళికి ఏఐ అనేది ఒక కోడ్‌లా మారింది కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ ప్రపంచంలోని అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. Read more

కళ్లు చెదిరే జయలలిత బంగారు ‘ఖజానా’!
Confiscation of Jayalalithaa assets in case of assets beyond her income

10 వేల చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం సహా మరెన్నో ఆస్తులు చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం Read more

కుంభమేళాలో 800 మంది మృతి..ఎప్పుడంటే..!!
From 1954 major stampedes t

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అర్ధరాత్రి భక్తుల తాకిడికి భద్రతా ఏర్పాట్లు నిర్వీర్యం కావడంతో 20 మంది మృతి చెందారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *