gamechanger song

‘గేమ్ ఛేంజర్’ సీక్వెల్ పై శ్రీకాంత్ క్లారిటీ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, ఈ మూవీ లో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “రామ్ చరణ్ ఈ సినిమాలో ‘అప్పన్న’ అనే పాత్రలో కనిపిస్తాడు. ఇది ఆయన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్ర. చరణ్ నటన చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఆ పాత్రలో ఆయన చాలా కొత్తగా, ఎమోషనల్‌గా కనిపిస్తాడు” అని తెలిపారు.

అలాగే, ఈ సినిమాలో ప్రముఖ నటుడు SJ సూర్య నటన గురించి కూడా శ్రీకాంత్ ప్రస్తావించారు. “సూర్య గారి పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆయన గత చిత్రమైన ‘సరిపోదా శనివారం’లో చూపించిన పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను మించి ఉంటుందని గ్యారంటీగా చెప్పగలను” అని పేర్కొన్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా చరణ్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇందులో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తుంది. ‘గేమ్ ఛేంజర్’ 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Related Posts
కర్ణాటకలో రెండు HMPV వైరస్ కేసులు
కర్ణాటకలో రెండు HMPV వైరస్ కేసులు

కర్ణాటకలో రెండు హ్యూమన్ మెటాప్యూమోవైరస్ (హెచ్ఎమ్పివి) కేసులు నమోదయ్యాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సోమవారం ధృవీకరించింది. వివిధ శ్వాసకోశ వైరస్ల కోసం ఐసిఎంఆర్ Read more

Mumtaz Hotels : తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా
Swamiji's dharna

తిరుపతిలో హిందూ స్వామిజీలు, ధార్మిక సంఘాలు ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన చేపట్టారు. ఒబెరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ హోటల్ ప్రాజెక్ట్ భక్తుల Read more

చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు భారీ జరిమానా
BRS Ex MLA Chennamaneni Ram

తెలంగాణ హైకోర్టు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఈ నిర్ణయం చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు ధ్రువీకరించడంతో Read more

టన్నెల్‌లో చిక్కుకున్న సిబ్బందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు
Desperate efforts were made to rescue the crew trapped in the SLBC Tunnel

భారీ నీరు నిలిచిపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం హైదరాబాద్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. Read more