ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) పరాజయల పరంపర కొనసాగుతోంది. తాజాగా ముంబై ఇండియన్స్తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో SRH 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైంది. ఈ పరాజయంతో SRH ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా ముగిసినట్టే అనిపిస్తోంది. బ్యాటింగ్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, బౌలింగ్ విభాగంలో ప్రదర్శన బలహీనంగా ఉండడం ఓటమికి కారణంగా మారింది.
144 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది
SRH తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి హైదరాబాద్ ఆటగాళ్లను దెబ్బతీశారు. అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్తో 70 పరుగులు చేసి జట్టు విజయానికి బాట వేసాడు. అతనికి తోడుగా సూర్యకుమార్ యాదవ్ 40 పరుగులతో నాటౌట్గా నిలవగా, విల్ జాక్స్ 22 పరుగులు చేశాడు.
ముంబై వరుసగా నాలుగో విజయం
ఈ విజయంతో ముంబై వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకుంది. మళ్లీ ఫామ్లోకి వస్తున్నట్టు సంకేతాలు ఇస్తోంది. మరోవైపు SRH మాత్రం ఓటములతో దెబ్బతింటూ ప్లే ఆఫ్స్ అవకాశాలపై శూన్యం చూపిస్తోంది. అభిమానుల్లో మళ్లీ నిరాశ నెలకొంది. తదుపరి మ్యాచ్ల్లో గెలిచి ఆదుకున్నా గనుక SRHకి తక్కువ అవకాశాలు మాత్రమే మిగిలినట్టు స్పష్టమవుతోంది.