Spouse pensions in AP… Applications accepted from today

AP Govt : ఏపీలో స్పౌజ్ పింఛ‌న్లు… ఈరోజు నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

AP Govt : ఏపీలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్పౌజ్‌ కేటగిరీ కింద కొత్తగా దాదాపు 90 వేల పింఛన్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇందుకు దరఖాస్తులను స్వీకరించేందుకు సిద్దమైంది. నేటి నుంచే ఇందుకు సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. వివరాలు… రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల తనిఖీ చేపట్టిన ప్రభుత్వం అర్హులైన వారికి అందేలా చర్యలు చేపడుతుంది. ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్‌ పొందుతున్న వారి స్థానంలో వారిపై ఆధారపడిన భార్య లేదా భర్తకు పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. దీన్నే స్పౌజ్‌ కేటగిరీగా గుర్తిస్తూ గతేడాది నవంబరు నుంచే అమలు చేస్తున్నారు. లబ్ధిదారులకు రూ.4 వేల చొప్పున పింఛన్ చెల్లిస్తున్నారు.

Advertisements
ఏపీలో స్పౌజ్ పింఛ‌న్లు ఈరోజు

అర్హులైన వారికి కూడా మే 1 నుంచి పింఛన్

2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య ఉన్న ఇదే కేటగిరీలో పెన్షన్లు కోల్పోయిన అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తాజాగా ఆదేశాలు ఇచ్చింది. 89,788 వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేసింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడనుంది. అర్హురాలైన మహిళ.. భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు తన ఆధార్‌ కార్డు తదితర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 25 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ వివరాలు స్వీకరిం చనున్నారు. అర్హులు ఈ నెల 30లోపు ఈ వివరాలు సమర్పిస్తే, మే 1న పింఛను సొమ్ము అందుతుంది. అయితే ఏప్రిల్ 30 తర్వాత నమోదు చేసుకున్నవారికి జూన్‌ 1 నుంచి పింఛన్ చెల్లింనున్నారు.

గతంలో ఇచ్చిన రూ.3 వేల పింఛన్‌ను రూ. 4 వేలకు పెంచింది.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే… వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లు గీత, మత్స్యకార, ఒంటరి మహిళ, ట్రాన్స్‌జండర్‌, హెచ్‌ఐవీ బాధితులు, డప్పు కళాకారులకు గతంలో ఇచ్చిన రూ.3 వేల పింఛన్‌ను రూ. 4 వేలకు పెంచింది. అలాగే దివ్యాంగులకు ఇచ్చే పింఛన్‌ను రూ. 3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, పూర్తి వైకల్యంతో కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇచ్చే పింఛన్‌ను రూ.5 వేల నుంచి రూ.15 వేలు చేశారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్‌ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛను కింద అందే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచారు.

Read Also: రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

Related Posts
బాలికల అక్రమ రవాణాను అడ్డుకున్న రైల్వే పోలీసులు
visakhapatnam

ఒడిస్సా నుంచి అక్రమంగా బాలికలను రవాణా చేస్తున్న 11 మందిని విశాఖ రైల్వే పోలీసులు కాపాడారు. శనివారం ఉదయం కిరండో నుంచి విశాఖకు వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలులో Read more

Samantha : స‌మంత‌కు గుడి క‌ట్టి పూజిస్తున్న తెనాలి యువ‌కుడు
Samantha : స‌మంత‌కు గుడి క‌ట్టి పూజిస్తున్న తెనాలి యువ‌కుడు

Samantha : స‌మంత‌కు గుడి క‌ట్టి పూజిస్తున్న తెనాలి యువ‌కుడు త‌మ అభిమాన న‌టీన‌టుల‌పై అభిమానులు చూపించే ప్రేమ అనిర్వచనీయం. కోలీవుడ్‌లో అభిమానులు త‌మ అభిమాన న‌టీన‌టుల‌కు Read more

Ration door delivery : రేషన్ డోర్ డెలివరీ వాహనాలను నిలిపివేస్తారా?
AP Ration door delivery

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డోర్ డెలివరీ (Ration door delivery) వాహనాల కొనసాగింపు పై ప్రభుత్వం పునఃసమీక్ష చేస్తోంది. యూపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఈ విధానం గురించి Read more

G7 సమావేశంలో ట్రంప్ విధానాలపై ప్రతికూల స్పందన
G7 సమావేశంలో ట్రంప్ విధానాలపై ప్రతికూల స్పందన

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో గ్రూప్ ఆఫ్ 7 (G7) సమావేశానికి హాజరైనప్పుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా భాగస్వామి దేశాల Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×