నేడు బడ్జెట్‌..ప్రజాభవన్‌ నల్లపోచమ్మ ఆలయంలో భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు

Special worship of Bhatti Vikramarka at Praja Bhavan Nalla Pochamma Temple

హైదరాబాద్‌: నేడు తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి భట్టి అసెంబ్లీకి బయల్దేరారు. మరికాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సందర్భంగా బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, జూలై నెలాఖరుతో ఓన్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమయం ముగియనుంది. దీంతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.