speaker ayyannapatrudu anger at Assembly members!

YSRCP : దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారు..అసెంబ్లీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం !

Ayyannapatrudu: ఏపి అసెంబ్లీలో సభ్యుల హజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండటంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవడం మీరెవరైనా చూశారా? అంటూ సభ్యులను స్పీకర్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు సభకు సగౌరవంగా హాజరుకావాల్సి ఉందన్నారు. వైసీపీ సభ్యులు ఎవరికీ కనపడకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిన పనేముందని అసహనం వ్యక్తం చేశారు. అలా వచ్చి వెళ్లడం వారి గౌరవాన్ని పెంచదన్నారు.

Advertisements
దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారు అసెంబ్లీ

వీరెవరూ సభకు హాజరు కాలేదు

వైసీపీ సభ్యులు బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్‌, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, దాసరి సుధ తదితరులు సంతకాలు చేసినట్లు తేలిందని స్పీకర్‌ చెప్పారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వీరెవరూ సభకు హాజరు కాలేదన్నారు. వేర్వేరు తేదీల్లో వీరు రిజిస్టర్‌లో సంతకాలు చేసినట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. హాజరుపట్టిలో వారి సంతకాలు ఉన్నా వాళ్లు సభకు వచ్చినట్టు స్పీకర్‌గా తాను గుర్తించలేదన్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు తలవంపులు తేవొద్దంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

ఓట్లేసిన ప్రజలకు తలవొంపులు తెచ్చేలా

గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత.. అంటే ఫిబ్రవరి 24 తేదీ తర్వాత వేర్వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టినట్లు నా దృష్టికి వచ్చింది. కానీ వారెవరు నాకు సభలో కనిపించలేదు.. ఇది సమంజసమో వారే నిర్ణయించుకోవాలి. ప్రజలకు ఆదర్శంగా నిలవాలి.. ఓట్లేసిన ప్రజలకు తలవొంపులు తెచ్చేలా ప్రవర్తించకూడదని నా అభిప్రాయం’ అంటూ సభలో అయ్యన్నపాత్రుడు ప్రకటన చేశారు.

Related Posts
మహాశివరాత్రి వేళ.. భక్తులతో కిటకిట లాడుతున్న కాశీ
On the occasion of Mahashivratri.. Kashi is hanging out with devotees

గంగా సంగమం జరిగే ప్రదేశం అస్సీ ఘాట్ కాశీ : మహాశివరాత్రి వేళ వారణాసిలో ఘాట్ లు అన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. కుంభమేళాకు వెళ్ళిన భక్తులు Read more

మూసీ కూల్చివేతల్లో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే – ఈటెల
etela musi

తెలంగాణలో మూసీ కూల్చివేతల అంశంపై బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో ముందడుగు వేస్తామని ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో Read more

Anita: భూమన కరుణాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: హోం మంత్రి అనిత
Anita: భూమనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: మంత్రి వంగలపూడి అనిత

టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) గోశాలలో గోవుల మరణాలపై వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. భూమన Read more

ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం
Etikoppaka Toys Shakatam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అరుదైన గౌరవం లభించింది. ఈసారి జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే కవాతులో ఆంధ్రప్రదేశ్ తరఫున ఏటికొప్పాక బొమ్మల Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×