Soon arrangements will be made for live telecast of all cases.Supreme Court

త్వరలో అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు..సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం మరో కీలక మందుడుగు వేసింది. మరి కొద్దిరోజుల్లో సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌ల వాదనలు, తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ యాప్ బీటా వర్షన్ ను పరీక్షించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వాదనలు, తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై అన్ని బెంచ్‌ల వాదనలతో పాటు తీర్పులను కూడా ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దీనికి సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్ లోని బీటా వర్షన్ ను ఇవాళ విజయవంతంగా పరీక్షించినట్లు సుప్రీం కోర్టు వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా అన్ని బెంచ్‌లలో జరగబోయే లైవ్ స్ట్రీమింగ్ కు సంబంధించిన చిత్రాలకు కూడా విడుదల చేసింది. అలాగే కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో లోటు పాట్లను సవరించి, లైవ్ స్ట్రీమింగ్ ను త్వరలోనే అధికారికంగా అమలులోకి తీసుకురానున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. దీంతో సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌లలో జరిగే వాదనలు, తీర్పులను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా రాజ్యాంగ ధర్మాసనం వాదనలు, తీర్పులను 2022 నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.

Related Posts
దాడి ఆరోపణలను ఖండించిన కౌశిక్ రెడ్డి
దాడి ఆరోపణలను ఖండించిన కౌశిక్ రెడ్డి

మాజీ కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి Read more

భైరవ అష్టమి మహోత్సవం..2024 రకాల మిఠాయిలు..84,000 చదరపు అడుగుల రంగోలీతో ప్రపంచ రికార్డు
Bhairava Ashtami Mahotsavam.2024 types of sweets.world record with 84000 square feet Rangoli

హైదరాబాద్‌: అఖిల భారతీయ బతుక భైరవ భక్త మండలి మరియు పార్శ్వ పద్మావతి శక్తి పీఠం, కృష్ణగిరి, తమిళనాడు పీఠాధిపతి డా. వసంత్ విజయ్ జీ మహారాజ్ Read more

ఐయామ్‌ఫినోమ్‌ ఇండియాను నిర్వహించిన ఫినోమ్‌
The phenom who organized iamphenom India

ఏఐ, ఆటోమేషన్ మరియు టాలెంట్ ఎక్స్‌పీరియన్స్‌తో పని యొక్క భవిష్యత్తు పరివర్తన.. ● ప్రతిభ అనుభవాలను పరివర్తింపజేస్తున్న సీఎక్స్ఓలు, సీహెచ్ఆర్ఓలు, హెచ్ఆర్ నాయకుల కోసం భారతదేశ మొదటి Read more

పట్నం నరేందర్ రెడ్డికి మరోసారి నోటీసులు !
Notices to Patnam Narender Reddy once again!

హైదరాబాద్‌: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *