somireddy chandra mohan reddy comments on vijayasai reddy

దోచేసిన నల్ల డబ్బుతో సేద్యం చేస్తావా ఏంటి..?: సోమిరెడ్డి

అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని అన్నారు. సేద్యం చేస్తానంటున్నావ్.. దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని నిలదీశారు.

2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేశావని విజయసాయిరెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మండిపడ్డారు. గత ఐదేళ్లూ అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్‌గా నిలిచి ఏ2 స్థానాన్ని కొనసాగించావని అన్నారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్లా అని ప్రశ్నించారు. అప్పుడు దోచుకున్న రూ.43 వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్‌తో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తును ముందు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

image

దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు.. అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అంతేనా లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ రాజీనామాల పరంపరం ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదని.. రాత్రికో, రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కరలేదని సోమిరెడ్డి అన్నారు.

Related Posts
అట్టహాసంగా వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ వేడుక
CBN VNGS

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా గుంటూరులోని శ్రీ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అతిధిగా హాజరై, Read more

మహారాష్ట్ర PCC చీఫ్ నానా పటోలే రాజీనామా: కాంగ్రెస్‌లో కొత్త సంక్షోభం
nana patole

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే Read more

ఎంఐసీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 2025 బడ్జెట్ లక్ష్యాలు
MIC Electronics Ltd. has put forward budget targets for the year 2025

హైదరాబాద్ : LED డిస్ప్లే మరియు లైటింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉన్న MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (MICEL), రాబోయే కేంద్ర బడ్జెట్ 2025 పురస్కరించుకుని తమ అంచనాలను Read more

అన్న జగన్‌ లేఖకు ఘాటుగా బదులిస్తూ.. లేఖ రాసిన షర్మిల
ys sharmila writes letter to brother ys jagan

అమరావతి: జగన్ ఇటీవల తనకు పంపిన లేఖకు కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా బదులిస్తూ..సమాధానం ఇచ్చారు. ఆస్తుల పంపకానికి సంబంధించి తనపై జరిగిన అన్యాయాన్ని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *