సీతారాం ఏచూరి కన్నుమూత

sitaram yechury
sitaram yechury

న్యూఢిల్లీ: వామపక్ష దిగ్గజం, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన… ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్ లో చేరారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. ఎయిమ్స్ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నారు.

సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఏపీలోని కాకినాడకు చెందినవారు. చెన్నైలో పుట్టిన ఆయన హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేశారు. సీతారాం ఏచూరీ దేశంలోని ప్రముఖ రాజకీయ నేతల్లో ఒకరిగా ఉన్నారు.