విషమంగానే సీతారాం ఏచూరి ఆరోగ్యం
న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆగస్టు 19న అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేరారు.
అప్పటి నుంచి డాక్టర్లు వెంటిలేటర్ పైనే ఏచూరికి వైద్యం అందిస్తున్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ సహా ఇతర అనారోగ్య సమస్యలతో ఏచూరి బాధపడుతున్నారు. అయితే.. ఏచూరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నట్లు పార్టీ నేతలు కొద్దిరోజుల క్రితం వెల్లడించింది.
తాజాగా.. పార్టీ కేంద్ర కార్యాలయం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల చేసింది. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సీపీఎం పొలిట్ బ్యూరో మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వెంటిలేటర్ సపోర్ట్ తో ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల బృందం ఆయనకు వైద్యం అందిస్తున్నారని పేర్కొంది