Victims demanding

Simhachalam : కోటి డిమాండ్ చేస్తున్న బాధితులు

విశాఖపట్నం సింహాచలం ఆలయంలో జరిగిన చందనోత్సవంలో గోడ కూలిన విషాద ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఆమెను ఎదుర్కొన్న బాధిత కుటుంబాలు ఒక్కో కుటుంబానికి కనీసం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. తమ ప్రాణాలను కోల్పోయిన కుటుంబ సభ్యుల స్థాయికి తగిన న్యాయం జరగాలంటూ బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisements

రూ.25 లక్షల పరిహారం

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, ప్రభుత్వం ఇప్పటికే రూ.25 లక్షల పరిహారంతో పాటు, ఒక్కో కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మృతుల పిల్లల విద్యాభవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం భాద్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గోడ కూలిన సంఘటనపై కమిటీని ఏర్పాటు చేసి, 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Read Also : Simhachalam : సింహాచలం ప్రమాదానికి కారణం అదేనా..?

గోడ నిర్మాణంలో లోపాలు

గోడ నిర్మాణంలో ఏవైనా నాణ్యతా లోపాలు ఉన్నాయా? కాంట్రాక్టు ఎవరి వద్ద ఉంది? నిర్మాణ అనుమతులు ఎలా మంజూరయ్యాయి? అనే అంశాలపై సమగ్రంగా దర్యాప్తు జరుగుతుందని హోంమంత్రి వెల్లడించారు. ఇది ఊహించని ఘటన అని, తాను కూడా వర్షం కురుస్తున్న సమయంలో అక్కడే దర్శనానికి వచ్చానని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించామని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం స్పందించిందని తెలిపారు. ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, విచారణలో ఎవరి తప్పులైనా బయటపడితే, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టంగా హెచ్చరించారు.

Related Posts
2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి – మమతా బెనర్జీ
2026 elections as a single

2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి . పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ Read more

Vijayawada : ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు
National award for Gollapudi Panchayat in AP

Vijayawada : ఏపీలోకి చెందిన గొల్లపూడి పంచాయతీకి ఆత్మనిర్బర్ పంచాయతీ అవార్డు దక్కింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండంలోని గొల్లపూడి పంచాయతీ జాతీయ అవార్డు కొల్లగొట్టింది. Read more

YCP: కూటమికి వైసీపీ షాక్..?
YCP: కూటమికి వైసీపీ షాక్..?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం ఉధృతంగా మారుతోంది. కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం విపక్ష వైఎస్ఆర్ Read more

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం: గ్రాండ్ వేడుకకు ఏర్పాట్లు
DEVENDRA

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదానంలో జరగనున్నది. ఈ కార్యక్రమానికి సుమారు 42,000 మంది Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×