ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న సంఘటనలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల పిఠాపురంలో దళితులను సామాజికంగా బహిష్కరించారన్న వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై శ్యామల గళం విప్పారు. “దళితుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇది తట్టుకోలేని దుర్మార్గం,” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.పవన్ కల్యాణ్ initialsను ఎద్దేవా చేస్తూ, “PPP అంటే పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్నా?” అని ప్రశ్నించారు. “మీ నియోజకవర్గంలో దళితుల్ని ఇలా నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటు,” అని శ్యామల మండిపడ్డారు.

విద్యుత్ షాక్తో మృతి చెందిన దళిత యువకుడి ఘటన
ఒక దళిత యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. అతని కుటుంబం న్యాయం కోరింది. కానీ, దానికి ప్రతిగా గ్రామస్థులు మొత్తం దళితుల్ని వెలివేశారు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.మల్లాం గ్రామంలో దళితులను పొలం పనులకు పిలవడం లేదు. వారు తీసుకునే పాలను కూడా నిలిపేశారు. ఇది అమానవీయంగా మారింది,” అని ఆమె అన్నారు.
దళితుల కోసం మీరు ఎటువంటి న్యాయం చేశారు?
పవన్ కల్యాణ్కు ప్రశ్నలు సంధించిన శ్యామల, “మీరు ప్రజలకు న్యాయం చేయాలి. కానీ మీ నియోజకవర్గంలో దళితులు అల్లాడుతున్నారు. ఇది మానవత్వానికి భిన్నంగా ఉంది,” అన్నారు.ప్రజల కోసం పోరాడతానన్న మాటలను నమ్మిన ప్రజలే ఇప్పుడు బాధపడుతున్నారు. పిఠాపురంలో దళితులపై జరిగినది మానవ హక్కుల ఉల్లంఘన,” అంటూ ఆమె హితవు చెప్పారు.
Read Also : Andhra Pradesh: వారణాసి- అయోధ్య స్పెషల్ ఆంధ్రా లో హాల్ట్ స్టేషన్లు ఇవే!