ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది “చేసిన పెళ్లికి మళ్లీ పెళ్లి చేసుకున్నట్టే” అని సెటైరిక్గా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ప్రభుత్వ యంత్రాంగాన్ని దోపిడీకి వినియోగిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని రాజకీయ ప్రపోజల్గా వాడుకుంటూ, ప్రజల అసలైన సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
రూ.3,000 కోట్ల భూమిని 99 పైసల చొప్పున కేటాయింపు
విశాఖపట్నంలో రూ.3,000 కోట్ల విలువ గల 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉర్సా అనే అజ్ఞాత కంపెనీకి ఎకరానికి 99 పైసల చొప్పున కేటాయించడాన్ని శ్యామల తీవ్రమైన అవినీతి చర్యగా అభివర్ణించారు. ఈ వ్యవహారంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారని, కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనేనని విమర్శించారు. ప్రజల వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోకుండా కేబినెట్ ద్వారా భూ కేటాయింపుకు ఆమోదం తెలపడం అన్యాయమని పేర్కొన్నారు. ఇది కూటమి ప్రభుత్వ బరితెగింపు తీరును బయటపెడుతోందన్నారు.
‘సూపర్-6’ హామీలను పూర్తిగా మరచిపోయారు
శ్యామల మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్-6’ హామీలను పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సంక్షేమ పథకాల దారిలో నడిపించే బదులు ఇసుక, మద్యం, ఫైబర్ నెట్, మైనింగ్, భూముల లాంటి రంగాల్లో మాత్రమే దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆవశ్యకాలు పక్కన పెట్టి, తమ ప్రయోజనాల కోసం పాలనను అడ్డదిడ్డంగా నడుపుతున్నారన్నది శ్యామల తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యల సారాంశం.
Read Also : Jagan : చంద్రబాబుపై జగన్ నిప్పులు