IPL 2025: గుజరాత్‌ టైటాన్స్‌ గెలుపు పై స్పందించిన శుభ్‌మన్ గిల్

IPL 2025: గుజరాత్‌ టైటాన్స్‌ గెలుపు పై స్పందించిన శుభ్‌మన్ గిల్

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా,సోమవారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన పోరులో గుజరాత్‌ టైటాన్స్‌(జీటీ) 39 పరుగుల తేడాతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. తొలుత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(55 బంతుల్లో 90, 10ఫోర్లు, 3సిక్స్‌లు) ధనాధన్‌ అర్ధసెంచరీకి తోడు సాయి సుదర్శన్‌(36 బంతుల్లో 52, 6ఫోర్లు, సిక్స్‌) సమయోచిత ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ 20 ఓవర్లలో 198/3 స్కోరు చేసింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.అరోరా, రానా, రస్సెల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 159/8 స్కోరు చేసింది. కెప్టెన్‌ రహానే(50) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ప్రసిద్ధ్‌ కృష్ణ, రషీద్‌ఖాన్‌ రెండేసి వికెట్లతో కోల్‌కతా పతనంలో కీలకమయ్యారు.

Advertisements

పవర్‌ప్లే

బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తున్న పిచ్‌పై గుజరాత్‌ ఓపెనర్లు గిల్‌, సుదర్శన్‌ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కోల్‌కతా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఈ ద్వయం బౌండరీలతో విజృంభించారు. ఆరోరా మూడో ఓవర్‌లో సుదర్శన్‌ రెండు ఫోర్లతో చెలరేగగా, మరోవైపు తానేం తక్కువ కాదన్నట్లు గిల్‌ కూడా చెలరేగాడు.రానాను లక్ష్యంగా చేసుకుంటూ ఐదో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి గుజరాత్‌ వికెట్‌ కోల్పోకుండా 45 పరుగులు చేసింది. ఎక్కడా జోరు తగ్గించని గిల్అలీ వేసిన 7వ ఓవర్‌లో వరుసగా 6,4, 4 బాదడంతో 17 పరుగులు వచ్చి చేరాయి. బౌలింగ్‌ మార్పుగా వచ్చిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని గిల్‌, సుదర్శన్‌ విడిచిపెట్టలేదు. ఈ క్రమంలో ఇద్దరు పోటాపోటీగా పరుగులు సాధించే ప్రయత్నం చేశారు.బంతి తేడాతో గిల్‌, సుదర్శన్‌ అర్ధసెంచరీ మార్క్‌ అందుకున్నారు. ఇన్నింగ్స్‌ దూసుకెళుతున్న తరుణంలో సుదర్శన్‌ను రస్సెల్‌ ఔట్‌ చేసి కోల్‌కతాకు బ్రేక్‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 114 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌నకు బ్రేక్‌పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్‌(41 నాటౌట్‌)..గిల్‌కు జతకలిశాడు. బట్లర్‌ను అండగా చేసుకుంటూ గిల్‌ మరింత చెలరేగాడు. దీంతో గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఊపందుకుంది. 18వ ఓవర్‌లో గిల్‌ ఔట్‌ కావడం, ఆ వెంటనే రాహుల్‌ తెవాటియా(0)కూడా పెవిలియన్‌ చేరారు. ఆఖర్లో బట్లర్‌, షారుఖ్‌ఖాన్‌(11 నాటౌట్‌) బ్యాట్లు ఝులిపించడంలో విఫలం కావడంతో ఆఖరి 5 ఓవర్లలో గుజరాత్‌ 59 పరుగులకే పరిమితమైంది.

 IPL 2025: గుజరాత్‌ టైటాన్స్‌ గెలుపు పై స్పందించిన శుభ్‌మన్ గిల్

ప్రదర్శన

మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శుభ్‌మన్ గిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్ వికెట్ అనంతరం భావోద్వేగాలను అదుపు చేసుకోలేకనే గట్టిగా సంబరాలు చేసుకున్నానని వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు మ్యాచ్‌లే పాయింట్స్ టేబుల్‌లో మా స్థానాన్ని నిర్ణయిస్తుందని మేం చర్చించుకున్నాం. వరుసగా ఈ రెండు మ్యాచ్‌లు గెలవడం సంతోషంగా ఉంది. మేం మా అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగించాలనుకుంటున్నాం. మేం ఎప్పుడూ ఒక బ్యాటర్ చివరి వరకు క్రీజులో ఉండాలని మాట్లాడుకోలేదు. ఇలాంటి కండిషన్స్‌లో పరుగులు ఎలా చేయాలి? మ్యాచ్‌ను చివరి వరకు ఎలా తీసుకెళ్లాలి? అనే విషయాలు మాత్రమే చర్చించుకున్నాం. ఈ గేమ్‌లో మేం చాలా ముందున్నాం. అయితే మ్యాచ్‌లో పైచేయి సాధించడం ఒక ఎత్తు అయితే మ్యాచ్‌ను ముంగించడం మరో ఎత్తని చెప్పాడు.

Read Also:IPL 2025: మరోసారి ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు !

Related Posts
అమెరికా ఆర్థిక సాయంపై ట్రంప్ కీలక నిర్ణయం
విదేశీ విద్యార్ధుల ఓపీటీ రద్దుకు ట్రంప్ సర్కార్ కొత్త బిల్లు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ సహా పలు దేశాలకు అందించే ఆర్థిక సహాయాన్ని నిలిపివేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఎఫ్ఐఐ ప్రయారిటీ Read more

2024 యుపీ బైపోల్ ఫలితాలు: బిజేపీ 6 స్థానాల్లో ఆధిక్యం
bjp

2024 లోక్‌సభ ఎన్నికల్లో కొంత నిరాశను అనుభవించిన తర్వాత, యుపీలో బిజేపీకి బలమైన తిరుగుబాటు కనిపిస్తోంది. అసెంబ్లీ బైపోల్ ఎన్నికల ఫలితాల ప్రకారం, బిజేపీ పార్టి తొలుత Read more

ఏనుగుల ఊరేగింపులో హమాస్ నేతల ఫోటోలు
ఏనుగుల ఊరేగింపులో హమాస్ నేతల ఫోటోలు

కేరళలోని పాలక్కడ్‌లో గత ఆదివారం జరిగిన త్రిథాల సాంస్కృతిక ఉత్సవం మరోసారి వివాదాస్పదం అయింది. ఇందుకు హమాస్‌ నాయకుల ఫోటోలను పట్టుకొని ఏనుగులపైకి యువకులు ఎక్కడమే కారణం. Read more

ఫిబ్రవరి 16 నాటికి ఢిల్లీ సీఎం ఎంపిక !
Selection of Delhi CM by February 16!

ప్రధాని స్వదేశానికి చేరుకున్న తర్వాతే సీఎం ఎంపిక. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి. న్యూఢల్లీ : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×