technology company

బెంగళూరులో తెలుగు ఐటీ ఉద్యోగులకు షాక్

ప్రపంచములో ఎక్కడ చూసినా ఒకటే మాట ఉద్యోగులకు భద్రత లేదు. బెంగళూరులోని ఎక్కువ మంది నివసించే వారిలో ఐటీ ఉద్యోగులది సింహభాగం. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో గడచిన కొన్ని నెలలుగా కర్ణాటక వ్యాప్తంగా కన్నడిగ నినాదం వినిపిస్తోంది. స్థానికులకే ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో అగ్రస్థానం కల్పించాలని వారు కోరుకుంటున్నారు. దీనికి అనుగుణంగా కర్ణాటక ప్రభుత్వం సైతం ఒక బిల్లును తీసుకొచ్చింది. అయితే పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో దానిని కొన్ని గంటల్లోనే సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇది మరువక మునుపే గతవారం సోషల్ మీడియాలో కన్నడిగులకు ఉద్యోగాల నియామకంలో ప్రాథాన్యత ఇవ్వాలంటూ ట్వీట్ సంచలనం రేపింది.

కర్ణాటకలో యువత ఉద్యోగాల కోసం రోడ్లపై యుద్ధం చేయకుండా.. నియమించుకునే స్థాయిలో ఉన్న కీలక ఉద్యోగులు, వ్యవస్థాపకులు పొరుగువారిపై కనికరం చూపకుండా కన్నడిగులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఒక వ్యక్తి చేసిన ట్వీట్ పెద్ద చర్చకు దారితీసింది. దీని తర్వాత తాజాగా ఇదే అంశంపై మరోసారి పెద్ద చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న ఉత్తర భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో దీనిపై చేసిన వీడియో వైరల్ అవుతోంది. కర్ణాటకలో జరుగుతున్న భాష, సాంస్కృతిక చర్చలో కన్నడిగులకు తన మద్దతును అందించాడు. కర్ణాటక ఈ విషయంలో సరైన వైపున వాదిస్తోందని అన్నాడు. ప్రస్తుతం కర్ణాటక ప్రజలపై చాలా ద్వేషం పెరుగుతోందని, అయితే వారి భూమి, వారి సంస్కృతి, వారి వారసత్వం, వారి గుర్తింపును కాపాడుకునే హక్కు వారికి ఎల్లప్పుడూ ఉంటుందని సదరు వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశాడు.

Related Posts
పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. నిమిషాల వ్యవధిలోనే వాయిదా
Parliament sessions begin. adjourned within minutes

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సమావేశాలు ప్రారంభం అయిన నిమిషాల వ్యవధిలోనే ఉభయ సభలు వాయిదా Read more

పథకాలు ఆపేందుకు ఆ రెండు పార్టీలు కలిశాయి: కేజ్రీవాల్
పథకాలు ఆపేందుకు ఆ రెండు పార్టీలు కలిశాయి: కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై మండిపడ్డారు. తమ పార్టీ Read more

ఆంధ్రాకు భారీ ప్రాజెక్ట్: చంద్రబాబు ట్వీట్
chandra babu

దావోస్‌లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. రెండ రోజు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు వరుస Read more

మూతబడ్డ శ్రీవారి వైకుంఠ దర్శనం కౌంటర్లు
ttd counters

తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం టికెట్ కౌంటర్లు క్లోజ్ అయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు టికెట్లు జారీ చేసిన టీటీడీ సిబ్బంది.. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *