సముద్రంలో మునిగిన నౌక..11 మంది మృతి

ఇటలీ దక్షిణ తీరంలో నౌక నీటమునిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 64 మంది గల్లంతైయ్యారు. సోమవారం ఇటలీ దక్షిణ తీరంలో ప్రయాణికులతో చెక్క పడవ ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో అనుకోకుండా ఆ పడవ సముద్రంలోని రాళ్లమధ్య చిక్కుంది. ఈ క్రమంలో పడవలోకి నీరు చేరడంతో పడవ మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఇటాలియన్ మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ వెంటనే సమీపంలో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలను రెస్క్యూ ఆపరేషన్‌కు మళ్లించింది.

దీనితో నాదిర్ అనే వాణిజ్య పడవలోని సిబ్బంది వెంటనే స్పందించింది. హుటాహుటీనా మునిగిన పడవలో లైఫ్ జాకెట్స్ దరించిన 51 మందిని రక్షించింది. కాగా వీరిలో ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు. అలానే పడవ దిగువ డెక్‌లో ఉన్న 10 మంది మృతి చెందారు. కాగా వారి మృతదేహాలను సైతం ఒడ్డుకు తరలించారు. కాగా పది రోజుల వ్యవదిలో ఇది రెండో ప్రమాదం. కాలాబ్రియా నుండి 200 కిలోమీటర్ల దూరంలో మొదటి ఓడ ప్రమాదం జరిగింది. ఎనిమిది రోజుల క్రితం టర్కీ నుంచి మేడే అనే ఫ్రెంచ్ బోట్‌ బయలుదేరింది. ఇటలీ సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సరిహద్దు ప్రాంతానికి చేరుకోగానే పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీనితో పడవ బోల్తాపడింది. దీనితో అప్రమత్తమైన పడవ సిబ్భంది సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలాని చేరుకుని పడవలోని కొంతమందిని రక్షించారు. కాగా మరికొందరు ప్రయానికులు గల్లంతైయ్యారు.