చంద్రబాబు గారూ.. రైతుల్ని ఆదుకోండి – వైస్ షర్మిల

sharmila letter to cm chandrababu

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రైతాంగాన్ని ఆదుకోవాలని APCC చీఫ్ YS షర్మిల సీఎం చంద్రబాబును కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదే సందర్భంలో ఏపీలో భారీగా ఆస్థి నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో షర్మిల ..సీఎం చంద్రబాబు కు లేఖ రాసారు. ‘కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం వల్లే పంటపొలాలు నీట మునిగి నష్టం వాటిల్లింది. రైతన్నల దుస్థితిపై MLAలు, MPలు మాట్లాడకపోవడం శోచనీయం. రైతన్నకు వచ్చిన ఈ కష్టాన్ని రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు.