జగన్.. అందుకే మీ ధర్నాకు దూరం – షర్మిల క్లారిటీ

ఢిల్లీలో ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు రాలేదనే జగన్ ప్రశ్నకు షర్మిల ఘాటుగా స్పందించారు. ‘మీ ధర్నాకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి..? పార్టీ ఉనికి కోసం కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యను రాజకీయం చేసినందుకా..?’ అని ఆమె ప్రశ్నిస్తూ ట్వీట్ చేసారు.

జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి.? అని ప్రశ్నించారు. ‘పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా.? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా.? 5 ఏళ్లుగా బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులు, ప్రత్యేక హోదాను వారికి తాకట్టు పెట్టినందుకా.?’ అంటూ నిలదీశారు. మణిపూర్ ఘటనపై ఇన్నాళ్లూ నోరెత్తలేదని.. ఇప్పుడు ఉన్నట్టుండి జగన్‌కు అక్కడి పరిస్థితులు గుర్తుకురావడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో జగన్ బీజేపీకే మద్దతిచ్చారు కదా.? అంటూ షర్మిల నిలదీశారు.

వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జగన్ జైకొట్టారు కదా.? అని షర్మిల ప్రశ్నించారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా.? అంటూ నిలదీశారు. జగన్ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందంటూ స్పష్టం చేశారు. ఈ ధర్నాలో జగన్ స్వలాభం తప్ప.. రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని కాంగ్రెస్ సంఘీభావం తెలపలేదని తెలిపారు. పోరాటానికి సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా.? ఇప్పుడు కలిసి పోరాడుదామని అంటున్నారని షర్మిల మండిపడ్డారు.