ఆ బిడ్డ విజయసాయి బిడ్డే అని శాంతి చెప్పింది – భర్త మదన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి – దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ ప్లీడర్ సుభాష్ వల్ల తన భార్య గర్భం దాల్చిందంటూ దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి పై భర్త మదన్ మోహన్ కీలక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో రెండు రోజులుగా విజయసాయి రెడ్డి పేరు మారుమోగిపోతుంది. ఈ క్రమంలో ఆదివారం మీడియా ముందుకు వచ్చిన శాంతి..సుభాష్ అనే వ్యక్తితో బిడ్డను కన్నానని స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కి తన బిడ్డకు సంబంధం లేదని, కేవలం డబ్బుల కోసం తన మాజీ భర్త మదన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని వాపోయింది.

సోమవారం ఉదయం ఎంపీ విజయసాయి రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు తనపై కావాలనే కొంతమంది ఇలాంటి ప్రచారం చేస్తున్నారని..వారు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడికైనా వెళ్తానని , తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతానని హెచ్చరించారు. సాయంత్రం శాంతి భర్త మదన్..హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేసారు.

వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డికి తన భార్యతో ఎలాంటి సంబంధం లేకుంటే డిఎన్ఏ టెస్ట్ అంటే ఎందుకు భయపడుతున్నారు..? అని మదన్ మోహన్ నిలదీసారు. తాను అమెరికాలో వుండగా భార్య శాంతి బిడ్డకు జన్మనిచ్చింది… ఆ బిడ్డ ఎవరివల్ల కలిగారో తేలాల్సి వుందన్నారు. సుభాష్ రెడ్డి అనే వ్యక్తితో తనకు రెండోపెళ్లి అయినట్లు శాంతి చెబుతున్నదంతా అబద్దమేనని… ఈ విషయంపై అతడితో మాట్లాడినట్లు మదన్ తెలిపారు. శాంతికి పుట్టిన బిడ్డతో తనకు ఏ సంబంధమూ లేదని సుభాష్ చెప్పినట్లుగా మదన్ పేర్కొన్నారు.

అయితే తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ చేయాలి… అందుకోసం శాంపిల్స్ ఇవ్వడానికి తాను సిద్దమేనని మదన్ అన్నారు. ఏ సంబంధమూ లేదంటున్నావుగా… నువ్వు సిద్దమేనా విజయసాయి రెడ్డి? అని ప్రశ్నించారు. డిఎన్ఏ టెస్ట్ కు ముందుకు వచ్చి నీ నిజాయితీని నిరూపించుకోవాలి…లేదంటే ఆ బిడ్డ నీకే పుట్టినట్లు నిర్దారించుకోవాల్సి వస్తుందన్నారు. డిఎన్ఏ టెస్ట్ లో తన భార్యకు పుట్టిన బిడ్డతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తేలితే మీడియా సాక్షిగా క్షమాపణలు చెబుతానని మదన్ అన్నారు. తాను అమెరికాలో వుండగానే భార్య శాంతి గర్భం దాల్చింది… విషయం తెలిసి ఇదేంటని ప్రశ్నిస్తే తననే బెదిరించిందని మదన్ తెలిపారు. ఎవరి వల్ల గర్భవతివి అయ్యావని అడిగితే చెప్పుతో కొడతానంటూ తిట్టిందన్నారు. గట్టిగా అడిగితే విజయసాయి రెడ్డి పేరు చెప్పింది… ఆయనకు పిల్లలు లేరు కాబట్టి తనద్వారా మగబిడ్డను కన్నారని తెలిపిందన్నారు. ఫిజికల్ గా కలిసారో లేక ఐవిఎఫ్ ద్వారానో తెలియదుగానీ తన బార్య శాంతి మాత్రం విజయసాయి రెడ్డి ద్వారానే బిడ్డను కనిందని మదన్ చెబుతున్నారు.

తన భార్య శాంతి చేసిన పనిగురించి తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చానని మదన్ అన్నాడు. గత మూడు నెలల నుంచి శాంతి టార్చర్ మరీ ఎక్కువయ్యిందని అన్నాడు. ఇక ఆమె చేష్టలను భరించలేకే ఈ విషయం బయటపెట్టినట్లు మదన్ పేర్కొన్నాడు.