SRH: పేలవ ప్రదర్శన కారణంగా షమీ, ఇషాన్ కిషన్‌ పై ఎస్ఆర్ హెచ్ వేటు!

SRH: పేలవ ప్రదర్శన కారణంగా షమీ, ఇషాన్ కిషన్‌ పై ఎస్ఆర్ హెచ్ వేటు!

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా,బుధవారం ఉప్పల్ మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గత మ్యాచ్‌లో ముంబై చేతిలోనే ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. అచ్చొచ్చిన హోమ్ గ్రౌండ్‌లో ముంబైని మట్టికరిపించి మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్ అదే ఆధిపత్యం కొనసాగించాలనుకుంటోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఉప్పల్ వికెట్‌పై మ్యాచ్ జరగనుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisements

సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లపై జట్టు మొత్తం ఆధారపడి ఉంది. ఈ ఇద్దరూ ఆడితేనే విజయం లేదంటే ఓటమి అన్నట్లుగా ఉంది ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ తేలిపోతుండటం జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది. బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి ఘోర వైఫల్యం కూడా జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. స్టార్ ఆటగాళ్ల వైఫల్యం నేపథ్యంలో తుది జట్టులో మార్పులు జరుగుతాయా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది.ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, నితీష్ కుమార్ రెడ్డిలను భర్తీ చేసే ప్రత్యామ్నాయ ఆటగాళ్లు జట్టులో లేరు. రూ. 10 కోట్లు, రూ. 11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన షమీ, ఇషాన్ కిషన్‌ దారుణంగా విఫలమవుతున్నారు. ఈ ఇద్దర్నీ తుది జట్టులో నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ వారి స్థానాల్లో ఎవర్నీ ఆడించాలనేది? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సన్‌రైజర్స్ బెంచ్ మొత్తం అనామక ఆటగాళ్లతో నిండిపోయి ఉంది. జయదేవ్ ఉనాద్కత్ ఉన్నా అతను షమీకి ప్రత్యామ్నాయంగా నిలుస్తాడా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి.

 SRH: పేలవ ప్రదర్శన కారణంగా షమీ, ఇషాన్ కిషన్‌ పై ఎస్ఆర్ హెచ్ వేటు!

టాపార్డర్

గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా రాహుల్ చాహర్‌‌ను ఆడించగా అతను ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అప్‌కమింగ్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అభినవ్ మనోహర్ లేదా స్మరన్ రవిచంద్రన్‌ను ఆడించే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా ఆడనుండగా ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ప్యాట్ కమిన్స్,మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగా బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. టాపార్డర్ చెలరేగితేనే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధిస్తుంది. లేదంటే మరో పరాజయం తప్పదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

Read Also: IPL 2025: కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి పై స్పందించిన అజింక్యా రహానె

Related Posts
త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని
Prime Minister who took holy bath at Triveni Sangam

ప్రయాగ్‌రాజ్ : దేశంలో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో ప్రధాని మోడీ పుణ్యస్నానం ఆచరించారు. ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి Read more

సెమీస్‌కు ముందు ఆసీస్‌ జట్టుకు ఎదురుదెబ్బ
సెమీస్‌కు ముందు ఆసీస్‌ జట్టుకు ఎదురుదెబ్బ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్ లు ఖరారయ్యాయి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో సెమీ-ఫైనల్ దశకు చేరుకున్న జట్లు ఒక్కో దశలో ఒకరికొకరు తలపడనున్నాయి. Read more

Content Creators: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేంద్రం శుభవార్త
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేంద్రం శుభవార్త

ఇంటర్నెట్ దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి చేరుకోవటంతో ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా కంటెంట్ చూడగలుగుతున్నారు. దీంతో ఇన్‌ఫ్లుయన్సర్ల ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. యూట్యూబ్, Read more

ఆఫ్ఘనిస్తాన్ కు భారీ షాకిచ్చిన ఇంగ్లాండ్!
ఆఫ్ఘనిస్తాన్ కు భారీ షాకిచ్చిన ఇంగ్లాండ్

తాలిబాన్ పాలనలో మహిళల హక్కులపై ఉల్లంఘనలు దృష్టిలో ఉంచుకొని, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని బ్రిటిష్ రాజకీయ నేతలు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×