Set up defense cluster in AP.. Lokesh appeals to Rajnath Singh

ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి: రాజ్‌నాథ్ సింగ్‌కు లోకేశ్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా నారా లోకేశ్ ఈనెల 4న ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన మంత్రి నారా లోకేశ్ ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు.

image

డేటా సిటీలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారుచేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నామని లోకేశ్ చెప్పారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును కేంద్ర రైల్వేశాఖమంత్రి రాజ్ నాథ్‌ సింగ్‌కు తెలిపారు.

గత పాలకుల అనాలోచిత విధానాలతో రూ.10లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందని అంటూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తోందని లోకేశ్ తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు హరీశ్ మాథుర్ ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

Related Posts
మొట్టమొదటి ఆల్-టెర్రైన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రారంభించిన క్వాంటా
Quanta launched the first all terrain electric motorcycle

కఠినమైన ఆల్-టెరైన్ పనితీరు కోసం రూపొందించబడిన, Quanta అనేది దేశంలోని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో కొత్త శకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆవిష్కరణ, శక్తి మరియు స్థిరమైన చలనశీలత యొక్క Read more

NXP AIM 2024లో అత్యుత్తమ స్థానం పొందిన కెఎల్‌హెచ్ అజీజ్ నగర్ కు చెందిన “బ్రెయినీ బాట్స్”
vaa 1

హైదరాబాద్‌: తమ బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులతో కూడిన "బ్రెయినీ బాట్స్" టీమ్‌ NXP AIM 2024 పోటీలో Read more

ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్‌కు సీఎం శంకుస్థాపన..
CM Revanth Reddy laid the foundation stone for the new building of Osmania Hospital

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియం వద్ద కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్ భవనానికి శుక్రవారం Read more

సల్మాన్తో నేను డేట్ చేయలేదు – ప్రీతి జింటా
salman khan preity zinta

బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ క్రికెట్ టీమ్ యజమాని ప్రీతి జింటా, సల్మాన్ ఖాన్‌తో తన సంబంధంపై క్లారిటీ ఇచ్చారు. "నేను ఎప్పుడూ సల్మాన్ ఖాన్‌ను డేట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *