ఎమ్మెల్యే అరికెపూడి ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం

తెలంగాణ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ – బిఆర్ఎస్ మధ్య పెద్ద రగడ నడుస్తుంది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్​ రెడ్డి, అరికెపూడి గాంధీ పరస్పర సవాళ్లతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. నేడు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో బీఆర్​ఎస్​ నేతలు భేటీకి పిలుపునిచ్చారు.

దీంతో ఎలాంటి ఉద్రికతలు చోటుచేసుకుంటాయి అని చెప్పి..పోలీసులు ఎక్కడిక్కడే బిఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అలాగే అరికెపూడి గాంధీ, కౌశిక్​రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్​రాజు ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. తనకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అంటే ఎంతో గౌరవమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. పార్టీలో కోవర్టుగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమికి కారకులయ్యారంటూ కౌశిక్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు.