Schools and colleges reopened in Manipur

మణిపూర్‌లో మళ్లీ తెరచుకున్న స్కూళ్లు, కాలేజీలు..

ఇంఫాల్‌: మణిపూర్‌లో కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్నవిషయం తెలిసిందే. అక్కడ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రంలో భారీగా సైనికులను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. ఈ నేపథ్యంలో ఇంఫాల్‌, జిరిజామ్‌ జిల్లాల్లో గత 13 రోజులుగా మూతబడిన పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరచుకున్నాయి. శుక్రవారం నుంచి రెగ్యులర్‌ తరగతులు ప్రారంభింస్తున్నట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ వెల్లడించింది. దీంతో ప్రభుత్వ ఎయిడెడ్‌ కాలేజీలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు పునఃప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా నిరుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్‌లో ఈ నెల 16న మళ్లీ హింస చెలరేగింది.

Advertisements

అల్లరి మూకలు మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లకు నిప్పంటించాయి. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ఇంటిపై దాడి చేయడానికి యత్నించాయి. కర్ఫ్యూ విధించినా ఇండ్లను దగ్ధం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఇంఫాల్ లోయ లో తీవ్ర అశాంతి నెలకొంది. దీంతో ఇంఫాల్ వ్యాలీలోని 5 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలను నవంబర్ 23 వరకు మూసివేసి ఉంచుతామని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కక్చింగ్ జిల్లాలలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నీ మూతబడి ఉంటాయని చెప్పారు. దానిని శుక్రవారం వరకు పొడిగించారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా సైన్యాన్ని మోహరించింది. దీంతో కేంద్ర బలగాల మొత్తం కంపెనీల సంఖ్య 288కు చేరింది.

Related Posts
Hyderabad : పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థినికి ఆత్మహత్య
Hyderabad : పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థినికి ఆత్మహత్య

Hyderabad : (ఎల్.బి.నగర్) : ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాగోల్ పోలీసుల Read more

ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం..
world computer literacy day

ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం ప్రతి సంవత్సరమూ డిసెంబరు 2న జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ విద్యను ప్రోత్సహించడం, డిజిటల్ నైపుణ్యాలు మరియు కంప్యూటర్ నైపుణ్యం Read more

ఢిల్లీలో తీవ్ర కాలుష్యం: వాయు నాణ్యత 49 సిగరెట్ల పొగతో సమానం..
smoking

ఢిల్లీ నగరం సోమవారం ఉదయం తీవ్ర పొగతో కమ్ముకొని పోయింది.. వాయు నాణ్యత సూచిక (AQI) అనేక ప్రాంతాల్లో 1,500ని దాటింది. దీంతో, అధికారులు "గ్రేడెడ్ రెస్పాన్స్ Read more

Pension :ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీం
Pension :ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం హామీతో కూడిన పెన్షన్ అందించే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపిఎస్ ) ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి రానుంది. ప్రస్తుతం Read more

Advertisements
×