Schedule released for Rajya Sabha by election in AP

Election Commission : ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

Election Commission : ఏపీలో మరోసారి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రానికి సంబంధించి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానం ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. ఈ మేరకు ఆ రాజ్యసభ స్థానానికి సంబంధించి ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీలన చేపట్టి.. మే 2 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. మే 9న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. విజయసాయిరెడ్డికి 2028 జూన్‌ వరకు పదవీకాలం ఉండగానే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మరి ఈ రాజ్యసభ స్థానం ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది.

Advertisements
ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు

టీడీపీకి రెండు, బీజేపీకి ఒక స్థానం

గతేడాది వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. ఈ మూడు స్థానాలు కూటమి దక్కించుకుంది. టీడీపీకి రెండు, బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కింది. అయితే ఈ ఏడాది జనవరిలో విజయసాయరెడ్డి తన రాజ్యసభ ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానన్నారు. అయితే ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ స్థానానికి సంబంధించిన ఎన్నిక కోసం ఇప్పుడు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ రాజ్యసభ పదవి కూటమికి దక్కనుండటంతో.. మూడు పార్టీలలో ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

మద్యం కుంభకోణంలో సిట్ నోటీసులు జారీ

మరోవైపు విజయసాయిరెడ్డికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లి సిట్‌ టీమే.. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు విజయవాడ సిటీ పోలీసు కమిషనరేట్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే విజయసాయిరెడ్డి ఈ నెల 17వ తేదీనే విచారణకు వస్తానని చెప్పారట.. అందుకు తగిన విధంగా సిట్‌ ఏర్పాట్లు చేసుకుంటోందట. ఈ మద్యం కుంభకోణంలో బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్‌ 179 ప్రకారం సాక్షిగా ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. గతంలో కూడా విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో కర్త, కర్మ, క్రియ రాజ్‌ కసిరెడ్డేనని అన్నారు.

Read Also: నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

Related Posts
స‌మ‌గ్ర ఇంటింటి కుటుంబ స‌ర్వేపై అధికారులతో సీఎస్ టెలీ కాన్ఫ‌రెన్స్
CSMeeting

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ సర్వేను పర్యవేక్షించడం, సర్వే Read more

KTR: కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు
Two cases registered against KTR

KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నల్గొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. పదో తరగతి పరీక్ష మాస్‌ కాపీయింగ్‌ ఘటనపై ఎక్స్‌ పోస్టులు Read more

ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు: చంద్రబాబు హెచ్చరిక
ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు: చంద్రబాబు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గంజాయి సహా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆయన చెప్పారు. Read more

Indian Army: పాక్‌కు ఝలక్ ఇచ్చిన భారత్‌.. ఆపరేషన్‌ సింధూర్‌పై మరో కీలక ప్రకటన!
Indian Army

పాక్ దాడులకు తక్షణ ప్రతీకారం: ఆపరేషన్ సింధూర్‌తో భారత్ గట్టి సందేశం భారతదేశ పశ్చిమ సరిహద్దులపై పాకిస్తాన్ అణచివేతలపై గట్టి స్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌ను Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×