మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్‌ ఫై సీఈవో సత్యనాదెళ్ల ట్వీట్

మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్‌పై ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ వర్క్ చేయలేదు. దీంతో అనేక మంది వినియోగదారులను ఇబ్బందుల్లో పడ్డారు. ప్రపంచంలో విండోస్, లైనక్స్, యాపిల్ ఇలా కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. వీటిలో ఎక్కువ మంది వాడేది మైక్రోసాఫ్ట్ విండోసే. ఇది క్రాష్ లేవడంతో.. ప్రపంచం ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ల్యాప్‌టాప్‌లు, పీసీలూ పనిచేయలేదు. వాటి స్క్రీన్లపై బ్లూ స్క్రీన్ కనిపించింది. బ్లూ స్క్రీన్ ఎర్రర్ కనిపించాక, సిస్టం రీబూట్ అయ్యింది. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం సెట్ కావడం తో హమ్మయ్య అనుకున్నారు.

దీనిపై ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఇది అతి పెద్ద సంక్షోభం అన్నారు. త్వరలోనే దీనికి పరిష్కారం చూపుతామన్నారు. నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్ డేట్ కారణంగా వరల్డ్ వైడ్‌గా టెక్నికల్ ఇష్యూ రైజ్ అయిందన్నారు. సమస్యను గుర్తించి దీనికి సంబంధించి క్రౌడ్ స్ట్రైక్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులకు సాంకేతిక సహాయం అందించి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నామన్నారు.