Samantha : నిర్మాతగా మారిన సమంత : త్వరలోనే థియేటర్స్లో విడుదల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషి’ చిత్రం తర్వాత మరో సినిమా అంగీకరించలేదు. ప్రస్తుతం ఆమె పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది.పూర్తిస్థాయి ఫిట్నెస్ను తిరిగి సాధించిన తర్వాత కొత్త ప్రాజెక్ట్స్లో నటించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. అయితే సమంత నటన నుంచి విరామం తీసుకున్నా, సినిమాల పట్ల ఆసక్తిని కొనసాగిస్తోంది. ఇప్పుడది మరింత స్పష్టంగా కనిపిస్తోంది.తాజాగా ఆమె నిర్మాతగా మారి తన తొలి చిత్రాన్ని రూపొందిస్తోంది.

సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ద్వారా తొలి ప్రాజెక్ట్ను మొదలుపెట్టింది. ‘శుభం’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ తెలుగు చిత్రంతో సమంత నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల (సినిమా బండి ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు.కథను వసంత్ మరిగంటి అందించగా, యూనిట్ సభ్యుల కథనం ప్రకారం, ఇది పూర్తి వినోదాత్మకంగా ఉంటూనే, అందులో థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి కనిపించనున్నారు.సినిమా నిర్మాణపరంగా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.
సినిమాటోగ్రఫీ బాధ్యతలను మృదుల్ సుజిత్సేన్ నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్గా రామ్ చరణ్ తేజ్ పనిచేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను ధర్మేంద్ర కాకర్లాడ్ చేపట్టారు. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. సమంత తొలిసారి నిర్మిస్తున్న చిత్రం కావడంతో, ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరిన్ని వివరాలు చిత్రయూనిట్ త్వరలో వెల్లడించనుంది. సమంత నటనకే కాకుండా, నిర్మాణ రంగంలోనూ తన ముద్రవేయాలని చూస్తోంది. ఆమెకు నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ‘శుభం’ సినిమా ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి!