Sajjanar appeals to betting app victims

Sajjanar: బెట్టింగ్ యాప్ బాధితులకు సజ్జనార్ విజ్ఞప్తి

Sajjanar: ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ, క్రికెట్ సెలెబ్రెటీస్, యూట్యూబ్ స్టార్స్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నమ్మి అమాయక ప్రజలు, యువకులు లక్షలాది రూపాయలు బెట్టింగ్స్ లో పెట్టి మోసపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మంగళవారం మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్ లో రూ.2 లక్షలు పోగొట్టుకొని, ఇంట్లో వాళ్ళకు మొహం చూపించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisements
బెట్టింగ్ యాప్ బాధితులకు సజ్జనార్

స‌మ‌స్య ఏదైనా స‌రే.. ఆత్మహత్య పరిష్కారం కాదు

ఈ వ్యవహారంపై తీవ్ర ఆవేదన చెందిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్ బాధితులకు కీలక విజ్ఞప్తి చేశారు. స‌మ‌స్య ఏదైనా స‌రే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ భూతానికి వ్యసనపరులే బలవన్మరణాలను పాల్పడకండని యువకులకు వినతి చేశారు. క్షణికావేషంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో ఒక్కసారి ఆలోచించమని అన్నారు. సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో అన్వేషించాలే తప్పా.. చనిపోవాలనే ఆలోచనే రాకూడదని సూచించారు. ఉన్నది ఒక్కటే జీవితం అని, ఏం సాధించిన అందులోనే అని తెలిపారు.

బలవన్మరణం వద్దు.. బ‌తికి సాధించ‌డ‌మే ముద్దు

జీవ‌న ప్రయాణంలో ఒక్కసారి కిందపడితే.. సర్వం కోల్పోయినట్లు కాదని, ఆముల్యమైనా జీవితాన్ని అర్దాంతరంగా కాలదన్నుకోవద్దని సలహా ఇచ్చారు. చీకటి వెలుగులా నిత్యం కష్టసుఖాలు అందర్నీ వెంటాడుతూనే ఉంటాయని, కష్టకాలంలో బాధలను ఇతరులతో పంచుకోవాలని, పరిష్కార మార్గాలు వెతకాలన్నారు. ఎంత కష్టం వచ్చినా ఎల్లకాలం ఉంటుందా?, చనిపోయినంతా మాత్రాన సమస్యలు టక్కున మాయమవుతాయా!? అనే ప్రశ్న వేసుకోవాలని, బలవన్మరణం వద్దు.. బ‌తికి సాధించ‌డ‌మే ముద్దు అని యువతకు హితబోధ చేశారు.

Related Posts
Murder: ముగ్గురు పిల్లల మృతి కేసులో వీడిన మిస్టరీ
murder: ముగ్గురు పిల్లల మృతి కేసులో వీడిన మిస్టరీ

పిల్లల మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లో జరిగిన సంచలన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురు చిన్నారుల మృతి వెనుక ఉన్న Read more

Pawan Kalyan :బీజేపీ ఆవిర్భావ దినోత్సవం..వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ట్వీట్
Pawan Kalyan :బీజేపీ ఆవిర్భావ దినోత్సవం..వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ట్వీట్

భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రోజు 1980, ఏప్రిల్ 6. దేశానికి ఒక కొత్త దిశను చూపించాలనే సంకల్పంతో శ్యామప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, Read more

పిఎల్‌ఐ పథకం కింద మెరిల్ వారి అధునాతన తయారీ ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రధాని
Merrill was the pm modi who launched their advanced manufacturing facility under the PLI scheme

గుజరాత్ : భారతదేశంలో అగ్రగామి గ్లోబల్ మెడ్‌టెక్ కంపెనీల్లో ఒకటైన మెరిల్ తమ అత్యాధునిక ఉత్పత్తి ప్రాంగణాలను గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఉత్పత్తి Read more

బంగ్లాదేశ్‌లో హిందు దాడుల నేపథ్యంలో త్రిపురా పర్యాటక సంఘం కీలక చర్య
protest against hindu

ఇండియా, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు రోజురోజుకీ బలహీనమవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల వార్తలు తరచుగా వస్తున్న నేపథ్యంలో, ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×