గత ఐదేళ్ల వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీలో అసాధారణ ప్రాధాన్యత లభించింది. మంత్రుల మాటకంటే ఎక్కువగా ఆయనే మీడియాకు స్పందించేవారు. సీఎం జగన్ను కలవాలంటే అనుమతులు, అపాయింట్మెంట్లు అన్నీ సజ్జల ద్వారానే జరగేవి. ఈ విధంగా పార్టీలో ఆయనే ‘సకల శాఖల మంత్రిగా’ గుర్తింపు పొందారు. అయితే అదే ప్రాధాన్యత పార్టీకి కొంతమంది నేతలకు అసహజంగా అనిపించింది. ముఖ్యంగా మండల స్థాయి నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు చాలామంది సజ్జల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.

ఇంతలోనే సజ్జల తనయుడు భార్గవ్ వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని పూర్తిగా నియంత్రించడం, పార్టీలో మరికొంతమందిని బాహిష్కరించడంతో అనేక నేతల అభిప్రాయాలను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం వంటి అంశాలు మరింత పెరిగాయి. పార్టీ పరాజయానికి వీరిద్దరి భూమిక కూడా ఉందని తమ పార్టీ నేతలే తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వైసీపీ ఓటమికి దారి తీసిన కారణాలు
గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం వెనుక వీరిద్దరి పాత్ర కూడా ఉందని సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇది ఒక్కటే కాకుండా ఆ పార్టీ మౌలికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చూపిస్తుంది. ఓటమి వెనుక ప్రధాన కారణాలు ఇవేగా భావిస్తున్నారు. అధికార శ్రేణుల దూరం నాయకత్వం, ముఖ్యంగా సీఎం జగన్ సామాన్య జనానికి, కార్యకర్తలకు ఎంతో దూరంగా ఉన్నారని భావించారు. జనసంపర్కం లోపించినందున ప్రభుత్వ పథకాలు ప్రజల హృదయాలను తాకలేకపోయాయి. పార్టీపై పూర్తిగా నియంత్రణ సజ్జల వద్ద ఉండటం, మంత్రులు కూడా ఆయన సూచనలకే లోబడి పనిచేయడం వల్ల ఇతర నేతల మధ్య అసంతృప్తి పెరిగింది. సాధారణ జనంతో జగన్ దూరంగా ఉండటం కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఓటమికి కారణమయ్యాయని పలువురు నేతలు తెలిపారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి సైతం సజ్జల తీరు కారణంగానే పార్టీకి రాజీనామా చేశారనే చర్చ సాగింది.
ఇటువంటి సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సొంత పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ ఐదు కోట్ల మందిని నేరుగా టచ్ చేసింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రతి గడపకూ వెళ్ళి సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని వర్గాలను ముందుకు నడిపించింది వైయస్ జగన్ ప్రభుత్వం. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనే విధంగా వైయస్ జగన్ పాలన కొనసాగించారు. కలలు కనడం కాదు దానిని ఆచరణలోకి తీసుకురావాలని ఒక్క జగన్ మాత్రమే అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్ళలో దానిని సమాన స్ధాయికి తీసుకొచ్చారు. పేదలు, ఎస్సీలు, మైనార్టీలు వీరిని ఎలా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలని ఆలోచించి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలుచేసి నిరూపించిన ఘనత జగన్ది. ఒక సంస్కర్తలా అణగారిని వర్గాలను చేయి అందించి పైకి తీసుకొచ్చారు. మొక్కవోని దీక్ష, నిబద్దత వల్లే ఇది సాధ్యమవుతుంది. అవన్నీ జగన్లో మనం చూశాం. మన పార్టీ పేదల పక్షం అని గుండెమీద చెయి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్నిచ్చారు. అదే కూటమి నాయకులు ఏడాది తిరగక ముందే బయటికి రాలేని పరిస్ధితుల్లో ఉన్నారు.
Read also: Vijayasai Reddy: లిక్కర్ స్కామ్ లో తన పాత్ర పై స్పందించిన విజయసాయిరెడ్డి