మే 3 వరకు శాయ్ శిక్షణా కేంద్రాలు బంద్
లాక్డౌన్ పొడగింపుతో ఈ నిర్ణయం తీసుకున్న అధికారులు
దిల్లీ: దేశంలో కరోనా కట్టడికి భారత ప్రధాని నరేంద్రమోదీ మే 3 వరకు లాక్డౌన్ను పొడగిచారు. దీంతో స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా( శాయ్ ) కూడా తన శిక్షణా కేంద్రాలను మే 3 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా ఏప్రిల్ 14 వరకు తమ శిక్షణా కేంద్రాలను నిలిపివేయాలనుకున్న కాని, లాక్డౌన్ ను మే 3 వరకు పొడగించడంతో అప్పటివరకు శిక్షణా కేంద్రాలను నిలిపివేస్తున్నట్లు శాయ్ అధికారి ఒకరు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/