జగన్ చెవిలో రఘురామ ఏంచెప్పాడు..?

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జగన్ కు బద్ద శత్రువైన రఘురామ..జగన్ చెవిలో ఏదో చెప్పడం ఇప్పుడు అందరు మాట్లాడుకునేలా చేసింది. సరిగ్గా సభ ప్రారంభానికి కాస్త ముందుగా జగన్ దగ్గరకు ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు వెళ్లారు. ఆయనను పలకరించి మాట్లాడారు. కొన్ని నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చ నడిచింది.

దీంతో అసెంబ్లీలో ఉన్నవారందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఉత్కంఠగా వారిద్దరిని చూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజు జగన్ చెవిలో ఎదో చెప్పడం కనిపించింది. ఆ వెంటనే జగన్ సీరియస్ గా రియాక్ట్ అవడం జరిగింది. దీంతో ప్రస్తుతం అందరి మధ్య ఈ విషయం గురించే చర్చ నడుస్తోంది.

ఏపీ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. గత ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రస్తుతం సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తరపున సభలో వినిపించారు. అయితే గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరిగిన దాడులపై నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే జగన్ సహా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కొద్దిసేపటికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగియడంతో అసెంబ్లీ సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు.