తిరుమల ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రెండవ ఘాట్ రోడ్డులో స్కూటర్ ను, ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.

మృతులను తమిళనాడుకు చెందిన దంపతులుగా గుర్తించారు. బస్సు కింద రెండు మృత దేహాలు ఇరుక్కుపోవడం తో క్రేన్‌ సాయంతో మృతదేహాలను తీసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.