కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై రెండు వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పాండిచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌, కృష్ణాజిల్లా బంటుమిల్లి వైపు నుంచి వస్తున్న ఐషర్‌ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతుల్లో ఐదుగురు పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఐషర్‌ వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీలో డ్రైవర్‌తో పాటు మరో ప్రయాణికుడు ఉన్నాడు.