కడప జిల్లాలో ఘోర ప్రమాదం..ఐదుగురు మృతి

రోడ్డు ప్రమాదాలు అనేవి విపరీతం అయ్యాయి. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రతి రోజు పదుల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గువ్వల చెరువు ఘాట్ లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతకొమ్మదిన్నె పరిధిలో కారు – కంటైనర్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కారులో ఉన్న నలుగురితో పాటు కంటైనర్ డ్రైవర్ మృతి చెందాడు. కారులో ఉన్న వారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను చక్రాయపేట మండలం కొన్నేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్ఠలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద ఘటనపై జిల్లా ఎస్‌పీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్‌పీ వెంట ఎస్‌బి ఇన్స్‌పెక్టర్ యు. వెంకటకుమార్, సి.కె దిన్నె సీఐ శంకర్ నాయక్, రామాపురం సీఐ వెంకట కొండారెడ్డి సిబ్బంది ఉన్నారు.