Road accident in America. Five Indians died

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయుల మృతి..!

అమెరికా: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. అమెరికాలోని రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన ఐదుగురిలో ముగ్గురు ఏపీకి చెందిన వారు ఉన్నారు. వీరిలో ఒక్కరు మహిళ కూడా ఉంది. ఈ ముగ్గురు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు.వీరిలో ఇద్దరు శ్రీకాళహస్తికి చెందిన వారు ఉండగా.. మరొకరు గూడురుకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మృతులు డేగపూడి హరితా రెడ్డి, చిరంజీవి శివ, గోపి తిరుమూరు గా గుర్తించారు.

టెక్సాస్ రహదారి నంచి దక్షిణ బాన్‌హామ్‌కు 8 కిలోమీటర్ల దూరంలో సోమవారం సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఒకదానికి ఒక్కటి బలంగా ఢీకొన్నట్లు తెలిసింది. అక్కడున్న తెలుగు వారు ఈ వార్తను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో గాయపడిన చెన్ను సాయి తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కాణాలు తెలియరాలేదు. రాంగ్‌రూట్‌లో వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

గతంలో కూడా అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగి తెలుగు వారు మృతి చెందారు. సెప్టెంబర్ లో అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయలు చనిపోయారు. టెక్సాస్‌లోని అన్నాలో యుఎస్ రూట్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన నలుగురిలో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారు. మరొకరు చెన్నైకి చెంది వారు. ఒకేసారి ఐదు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి(27),ఫరూక్ షేక్ (30), లోకేష్ పాలచర్ల (28) ఉన్నారు. మరో వ్యక్తి తమిళనాడుకు చెందిన దర్శిని వాసిదేవన్ (25)గా గుర్తించారు.

Related Posts
ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకం..
AP High Court appoints three new judges copy

అమరావతి: ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియవితులయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులోనే న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లను అదనపు Read more

కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి
Attack on Congress leader F

కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి జరిగింది. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే Read more

‘దొరికినకాడికి దోచుకో… అందినంత దండుకో’ ఇది కాంగ్రెస్ దందా – కేటీఆర్
ktr jail

భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, రాష్ట్రంలో అక్రమ వ్యాపారాలు, సహజ వనరుల దోపిడీపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర Read more

ప్రణబ్ ముఖర్జీ స్మారకానికి కేంద్రం అనుమతి
Centre approves Pranab Mukh

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల ప్రణబ్ కుమార్తె కృతజ్ఞతలు తెలియజేశారు. వారి కుటుంబం స్మారక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *