మేడ్చల్ లో కారు ఢీ.. 10 మీటర్లు ఎగిరి పడ్డాడు వ్యక్తి

మేడ్చల్‌ జిల్లా అన్నోజిగూడలో రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొంది. దీంతో అతడు ఒక్కసారిగా అంతెత్తున ఎగిరిపడ్డాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో జాగ్రత్తలు వహించాలని పదే పదే చెపుతున్నప్పటికీ చాలామంది నిర్లక్ష్యం వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫోన్ మాయలో పడి ఎక్కడికి వెళ్తున్నాం..ఏంచేస్తున్నాం..అనేది మరచిపోతున్నారు. తాజాగా మేడ్చల్‌ జిల్లా అన్నోజిగూడలో కూడా అదే జరిగింది. ఫోన్ మాట్లాడుతూ..గిరి అనే వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు.

అవతల వచ్చే వాహనాన్ని గమనించలేదు. దీంతో వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడం తో ప్రాణాలు పోయాయి. ఫోన్‌ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా అంతెత్తున ఎగిరిపడ్డాడు. పోచారం ఐటీ కారిడార్‌ పీఎస్‌ పరిధిలో ఘటన జరిగింది. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన గిరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందాడు.