పెరిగిన ఉష్ణోగ్రతలు..తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ

Temperatures : పెరిగిన ఉష్ణోగ్రతలు..తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ!

Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం కూడా ఉంది. ఈరోజు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున 7 జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Advertisements
పెరిగిన ఉష్ణోగ్రతలు..తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ

కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు

ఏపీలోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగినట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రెంటచింతల ప్రాంతంలో సాధారణంగా మార్చి నెలలో 35 డిగ్రీల వరకు ఎండ ఉంటుంది. ఈసారి మాత్రం మార్చి మధ్యలోనే 42 డిగ్రీలు దాటిపోయింది. దాంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని అక్కడి జనం ఆందోళన చెందుతున్నారు. కోస్తాలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం అనూహ్యంగా మారుతోంది.

డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం

మార్చిలోనే భానుడు తన ప్రతాపంతో టాప్ లేపేస్తున్నాడు.. ఈ ప్రాంతం అ ప్రాంతం అని తేడాలేకుండా మంటలు పుట్టిస్తున్నాడు. దీంతో జనాలు అసమ్మర్ హీట్ ను బీట్ చేసేందుకు చల్ల చల్లని,కూల్ కూల్ గా వుండే ఫ్రూట్స్ , సమ్మర్ డ్రింక్స్ ను తీసుకుని ఎండ ప్రతాపాన్నికూల్ చేస్తున్నారు. మరో వైపు వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం, గుండెపోటు ప్రమాదాలు పెరుగుతాయి అంటున్నార వైద్య నిపుణులు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Related Posts
జగిత్యాల సబ్ జైలులో గుండెపోటుతో మృతి..
jagityal

మల్యాల మం. రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం ఓ కేసులో జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా, ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే Read more

Hotel Bar Licenses : హోటల్ బార్ల నిర్వాహకులకు గుడ్ న్యూస్ : లైసెన్సు ఫీజు తగ్గింపు
Hotel Bar Licenses హోటల్ బార్ల నిర్వాహకులకు గుడ్ న్యూస్ లైసెన్సు ఫీజు తగ్గింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో స్టార్ హోటళ్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.బార్ లైసెన్సుల ఫీజులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ Read more

వర్రా రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌
వర్రా రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

అమరావతి: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రవీందర్‌రెడ్డిని Read more

దళితుడ్ని కిడ్నాప్ చేసినందుకు వంశీని అరెస్ట్ చేశారు : లోకేశ్
Vamsi was arrested for kidnapping a Dalit .. Lokesh

ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు అమరావతి: తప్పు చేసిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షిస్తామన్నారు. 2019-24 మధ్య కొనసాగిన అరాచకపాలన అందరూ చూశారన్నారు. ప్రజా Read more

Advertisements
×