చంద్రబాబు లేఖపై సీఎం రేవంత్ సానుకూల స్పందన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై చర్చిద్దామని జులై 6 సాయంత్రం వీటిని చర్చించడానికి కలుద్దామని తెలుపుతూ లేఖ రాసారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

చంద్రబాబుకు రేవంత్ రేపు లెటర్ రాయనున్నారు. దీని ప్రకారం ఆరవ తేదీన ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ప్రజాభావన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉంది. పక్క రాష్ట్రంతో సఖ్యతగా ఉంటామని మొదటి నుండి చెపుతున్న రేవంత్..విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుందామనే ధోరణిలో ఉన్నారు.