రైతు రుణమాఫీపై CM రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్

కాంగ్రెస్ సర్కార్ చెప్పినట్లే ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. సోమవారం రుణమాఫీకి సంబదించిన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి.. ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసం.. ‘రైతు రుణమాఫీ పథకం’ అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. నాడు శ్రీ మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా.. నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో రాష్ట్ర రైతాంగానికైనా.. ఎంత కష్టమైనా.. ఎంత భారమైనా.. ఏకకాలంలో రుణమాఫీ.. చేసిన.. చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.

రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి.. పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలు కార్యాచరణలో.. తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా.. మలి అడుగు విధివిధానాల ఖరారు అని తెలిపారు. ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇది రైతన్నకు..మీ రేవంతన్న మాట” అంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.