పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్

రుణమాఫీ ఫై రైతుల్లో ఉన్న అనుమానాలకు తెరదించారు సీఎం రేవంత్ రెడ్డి. పాస్ బుక్ ఆధారంగానే రూ. 2 లక్షల రుణమాఫీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే, కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామని తెలిపారు. ఈ నెల 18లోపు రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని , ఎల్లుండి సాయంత్రానికల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేసారు. రుణమాఫీ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.