‘నేను ఎప్పటికీ నీతోనే ఉంటా..’ రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన తాజా పోస్ట్ వైరల్ గా మారింది. బద్రి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రేణు..ఆ సినిమాతోనే పవన్ తో ప్రేమలో పడింది. కొంతకాలం సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకోవడం , కొంతకాలానికి విడాకులు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం పూణే లో తన ఇద్దరి పిల్లలతో ఉంటుంది. ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈమె ..నిత్యం తన పిల్లలకు సంబంధించిన అప్డేట్స్ తో పాటు యానిమల్ విషయాలను తెలియజేస్తూ వస్తుంది.

కాగా తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘నేను ఎప్పటికీ నీతోనే ఉంటా.. అద్భుతమైన పీపుల్స్’అని రాసుకొచ్చింది. ఓ యానిమల్ లవర్ రేణుదేశాయ్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ పోస్టు పెట్టింది. దానికి ఆమెను ట్యాగ్ చేస్తూ రేణుపై కామెంట్స్ చేసింది. సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ పోస్టు వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎల్లప్పుడూ నీకోసం నేనుంటాను అంటే పవన్ కల్యాణ్ కోసం ఎంతకాలమైనా తాను ఎదురుచూస్తుంటాను అనే అర్థం వస్తుందని, ఆ అర్థంలోనే ఈ పోస్టు పెట్టిందని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. వీరిద్దరూ మంచి జంట అని, విడిపోకుండా ఉంటే బాగుండేదని, ఎందుకు విడిపోయారో వీరిద్దరికే తెలియాలని, పిల్లల్ని అంత ప్రేమగా చూసుకునే పవన్ కల్యాణ్ రేణు దేశాయ్ తో కూడా అలాగే ఉంటే బాగుండేదని, ఇద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారని, వారి కాపురం కూడా అందరికీ ఆదర్శంగా నిలిస్తే బాగుండేదని మరొక నెటిజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.