నన్ను టార్చర్ చేయకండి – రేణూ దేశాయ్ విన్నపం

తనను టార్చర్ చేయడం ఆపాలని సినీ నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను విజ్ఞప్తి చేశారు. ఏపీ మంత్రి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేక పరిచ‌యం అవ‌స‌రం లేదు. ఒకప్పుడు కేరాఫ్ పవన్ కళ్యాణ్ గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియా కే పరిమితం అయ్యింది. రీసెంట్‌గా మ‌ళ్లీ సినిమాల‌కు ఎంట్రీ కూడా ఇచ్చింది.

ఈ భామ సోష‌ల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన ప‌వ‌న్ అభిమానులు కామెంట్లు పెడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తీసుకురాకండి అని రేణు దేశాయ్ ఎన్ని సార్లు వేడుకున్న ప‌వ‌న్ అభిమానులు మాత్రం రేణు ఎలాంటి పోస్ట్ పెట్టిన ఆ పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీలో మంత్రి అయిన సంద‌ర్భంగా.. ఓ అభిమాని రేణును ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాగా.. ఆ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రేణు దేశాయ్.

సుధాకర్ అనే పవన్ అభిమాని రేణు దేశాయ్‌ని ట్యాగ్ చేస్తూ.. ”వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది. ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాం”. వదిన అంటూ కామెంట్ చేసాడు.

ఈ పోస్ట్‌కు రేణు దేశాయ్ రిప్ల‌య్ ఇస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ”సుధాకర్ గారు మీకు కొంచెం అన్న బుద్ధి ఉంటే ఇలా చెప్పారు. పవన్ కళ్యాణ్ ను నేను వదిలేయలేదు. అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి” అంటూ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో పవన్ అభిమాని రేణూను ట్యాగ్ చేస్తూ ‘వదినగారూ దేవుడిని పెళ్లి చేసుకుని, ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టుంటే బాగుండేది’ అని కామెంట్ చేశారు. దీనికి ఆమె రిప్లె ఇస్తూ ‘పవన్ను నేను వదిలేయలేదు. ఆయనే నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నారు’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.