Religious Event Maha Kumbh Mela .. Mamata Banerjee

మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా : మమతా బెనర్జీ

యూపీ సర్కారు వీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు చేసిందని ఆగ్రహం

కోల్‌కతా : ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళాకు సరైన ప్రణాళిక లేదని విమర్శించారు. ఇటీవలే అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటననను ప్రస్తావిస్తూ.. మహాకుంభ్‌ను ‘మృత్యు కుంభ్‌’గా అభివర్ణించారు.

మతపరమైన కార్యక్రమం మహా కుంభమేళా

ఇంత సీరియస్‌ ఈవెంట్‌ను ఎందుకు ఓవర్‌ హైప్‌

కుంభమేళాకు వచ్చే వీఐపీలకు మాత్రం ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. పేదలను మాత్రం విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ‘దేశాన్ని విభజించేందుకు మతాన్ని అమ్ముతోంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత సీరియస్‌ ఈవెంట్‌ను ఎందుకు ఓవర్‌ హైప్‌ చేశారంటూ..? యూపీ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

కుంభమేళా అంటే తనకు గౌరవం ఉందన్నమమతా బెనర్జీ

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో దీదీ మాట్లాడుతూ.. ‘అది ‘మృత్యు కుంభ్‌’. నేను మహాకుంభ్‌ను గౌరవిస్తాను. పవిత్ర గంగామాతనూ గౌరవిస్తా. కానీ అక్కడ సరైన ప్రణాళిక లేదు. ధనవంతులు, వీఐపీలకు ప్రత్యేక క్యాంపులు ఉన్నాయి. రూ.లక్షలు వెచ్చించి ప్రత్యేక టెంట్లు బుక్‌ చేసుకునే వ్యవస్థ ఉంది. కానీ పేదలకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లూ లేవు. ఇలాంటి కార్యక్రమాల్లో (మేళా) తొక్కిసలాట ఘటనలు సాధారణమే. కానీ అలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేయడం ముఖ్యం. ఇక్కడ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు..?’ అంటూ యూపీ సర్కార్‌ను దీదీ ప్రశ్నించారు.

Related Posts
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..ఆరుగురు మృతి
Fire accident in hospital..Six dead

దిండిగల్: తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. పొగతో ఊపిరి ఆడకపోవడం వల్లే వారు మరణించినట్టు Read more

సీగ్రమ్స్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మ్యూజికల్ ఉత్సవం..
Seagram Royal Stag Boom Box Musical Festival

‘లివింగ్ ఇట్ లార్జ్’ స్ఫూర్తికి చిహ్నంగా హైదరాబాద్‌లో బోల్డర్ హిల్స్ లో జనవరి 25న మ్యూజిక్ మరియు యువ సంస్కృతి యొక్క వైభవోపేతమైన సంబరం. రాయల్ స్టాగ్ Read more

భాషను తక్కువగా అంచనా వేయొద్దు – కమల్ హాసన్
భాషను తక్కువగా అంచనా వేయొద్దు - కమల్ హాసన్

తమిళనాడులో పీఎం శ్రీ స్కూళ్ల పేరుతో హిందీని తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ యత్నాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు అన్ని రాజకీయ Read more

కుల గణన సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్..!
కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్

మూడు పద్ధతుల్లో కుల సర్వే హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు బలహీన వర్గాల నాయకులు, ఫ్రొఫెసర్లు వివిధ స్థాయిల్లో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కుల Read more