Relief for YS Jagan in the Supreme Court

వైఎస్ జగన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు జగన్ పై ఉన్న కేసులను బదిలీ చెయ్యాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇక, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సోమవారం వెనక్కి తీసుకున్నారు. ఈ పిటిషన్ పై జనవరి 27న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. జగన్ ఆస్తుల కేసులో ట్రయల్ సరిగా జరగడం లేదని రఘురామకృష్ణరాజు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం, శుక్ర,శనివారాల్లో మాత్రమే ఈ కేసుపై విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. వైఎస్ జగన్ ఆస్తుల కేసులను బదిలీ చేయాలని.. బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది.

ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు ప్రత్యేక కోర్టులు రోజువారీగా విచారణ చేయాలని జగన్ తరపు న్యాయవాది కోరారు. దీంతో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో తన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

images

కాగా, ఈరోజు రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం విచారణ జరిపారు. ఈ తరుణంలోనే పిటిషనర్ రఘురామ కృష్ణం రాజు, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వాదనలు జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం సభ్యులు విన్నారు. ఈ క్రమంలోనే జగన్ పై ఉన్న కేసులను బదిలీ చెయ్యాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఉన్నత న్యాయం స్థానం డిస్మిస్ చేసింది. దీంతో సుప్రీం కోర్టులో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఊరట లభించింది.

Related Posts
వ్యవసాయ ఆవిష్కరణలలో అగ్రగామిగా క్రిస్టల్ క్రాప్ ప్రొటక్షన్
Crystal Crop Protection is a pioneer in agricultural innovation

న్యూఢిల్లీ : క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్, వ్యవసాయ ఆవిష్కరణలలో ఉంది. కొన్ని ఆసియా దేశాలలో విక్రయాల కోసం బేయర్ AG నుండి క్రియాశీల పదార్ధం Ethoxysulfuron Read more

మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కోసం మోదీకి లేఖ: కాంగ్రెస్
మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కోసం మోదీకి లేఖ: కాంగ్రెస్

మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కావాలని ప్రధాని మోదీకి లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోసం ప్రత్యేక స్మారక స్థలాన్ని Read more

పక్కా ప్రణాళికతో దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్
revanth

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే కేంద్రంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. తాజాగా దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించగలిగిందని ఆయన తెలిపారు. ఈ Read more

TTD ఛైర్మన్ గా బీఆర్ నాయుడు ప్రమాణం
BR Naidu

టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు పదవి బాధ్యతలు చేపట్టారు. రీసెంట్ గా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నూతన బోర్డు సభ్యులను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు . Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *